E-Paper
Advertisement

CM: ఆస్తుల్లో జగన్.. అప్పుల్లో కేసీఆర్.. సీఎంల జాబితాలో మనోళ్ల మార్క్..

CM: ఆస్తుల్లో జగన్.. అప్పుల్లో కేసీఆర్.. సీఎంల జాబితాలో మనోళ్ల మార్క్..
Advertisement
cm kcr cm jagan

CM: తెలుగు రాష్ట్రాల సీఎంలు తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. అత్యంత ధనవంత సీఎంలలో జగన్‌ మోహన్‌ రెడ్డి టాప్‌ ప్లేస్‌ లో ఉన్నారు. అప్పులు ఎక్కువగా ఉన్న సీఎంల జాబితాలో ఫస్ట్ ప్లేస్ కేసీఆర్‌దే.

28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల ఆస్తులు, అప్పులు, కేసులపై అసోసియేషన్‌ ఫర్‌ డెమెక్రటిక్‌ రీఫామ్స్‌ , నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంయుక్తంగా సర్వే చేపట్టింది. గత ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల సీఎంలు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగానే ఈ సర్వే చేశారు. సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. జగన్ ఆస్తులు దాదాపుగా 510 కోట్లు. ధనిక సీఎంల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో స్థానంలో నిలిచారు. కేసీఆర్ ఆస్తులు 23 కోట్ల 55 లక్షలుగా ఉన్నాయి. ఇక జగన్ తర్వాతి స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. పెమాఖండుకు 163 కోట్లు, నవీన్ పట్నాయక్ 63 కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఇక అత్యంత బీద సీఎంగా పశ్చిమబెంగాల్ నుంచి మమతాబెనర్జీ ఉన్నారు. ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఉన్నారు. మమత ఆస్తి కేవలం 15 లక్షలేనట. విజయన్, మనోహర్ లాల్ కోటికిపైగా ఆస్తులను కలిగి ఉన్నట్టు సర్వేలో తేలింది.

అత్యధిక ఆస్తులు కలిగిన జాబితాలో జగన్ టాప్ ప్లేస్ లో ఉంటే.. అత్యధిక అప్పులు ఉన్న సీఎంలలో కేసీఆర్ ముందు ఉన్నారు. కేసీఆర్ కు 8కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఆ తర్వాతిస్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు ఉన్నారు. బసవరాజ్ బొమ్మైకు 4కోట్లు, ఏక్ నాథ్ షిండేకు 3కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఇక 13 మంది ముఖ్యమంత్రులపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయి. ఇందులోనూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫస్ట్‌ ప్లేస్‌ లో ఉన్నారు.కేసీఆర్‌ పై మొత్తం 64 కేసులు ఉండగా.. అందులో 37 కేసులు సీరియస్‌ వి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలు ఉన్నారు.

Advertisement

30 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఒక్కరు మాత్రమే మహిళ ఉన్నారు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సీఎం కూడా ఒక్కరే ఉన్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్లు ముగ్గురు, గ్రాడ్యుయేట్లు 11 మంది, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ నుంచి నలుగురు ఉన్నారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ముఖ్యమంత్రుల జాబితాలో 9 మంది ఉండగా.. డాక్టరేట్, డిప్లమా చదివిన వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×