E-Paper
Advertisement

NTR: రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. కేంద్రం ఆమోదం..

NTR: రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. కేంద్రం ఆమోదం..
Advertisement

NTR: కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ. జాతిపితకు దేశం ఇచ్చిన గౌరవం ఇది. పలు అరుదైన సందర్భాల్లో.. ప్రత్యేక వ్యక్తుల ఫోటోలతో నాణేలు, స్టాంపులు ముద్రించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఆ అద్భుత గౌరవం తెలుగుతేజం నందమూరి తారకరామారావుకు దక్కింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల వేళ.. కేంద్రం ప్రభుత్వం తెలుగువారికి తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్‌ బొమ్మతో 100 రూపాయల వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిధిలోని మింట్ ఈ నాణేన్ని తీసుకురానుంది.

ఆ వెండి నాణెం ఎలా ఉండాలి? ఎన్టీఆర్ కు చెందిన ఏ ఫోటో పెట్టాలి? తదితర అంశాలపై రామారావు కూతురు పురందేశ్వరితో మింట్ అధికారులు చర్చించారు. ఆమె నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రధానంగా మూడు ఫోటోలను పరిశీలించారు. వాటిలో ఒకటి ఫైనల్ చేయనున్నారు.

Advertisement

ఎన్టీఆర్ పేరిట నాణెన్ని ముద్రించాలని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను.. బీజేపీ నేత పురందీశ్వరి కోరారు. ఆమె రిక్వెస్ట్ మేరకు.. నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ ఫోటోతో వెండి నాణెం ముద్రించేలా మింట్ నుంచి ఆమోదం వచ్చేలా చూశారు.

వెండి నాణెం తయారీ ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్టీఆర్ సిల్వర్ కాయిన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×