E-Paper
Advertisement

Cricket Betting:- కోట్లలో టర్నోవర్.. క్రికెట్ బెట్టింగ్స్‌ ముఠాల బరితెగింపు

Cricket Betting:- కోట్లలో టర్నోవర్.. క్రికెట్ బెట్టింగ్స్‌ ముఠాల బరితెగింపు
Advertisement

Cricket Betting:- మ్యాచ్ ఏదైనా సరే బెట్టింగ్ కామన్. మొన్ననే ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి ఈ బెట్టింగ్ మోజులో పడి ఏకంగా వంద కోట్లు పోగొట్టుకున్నాడు. మొదట్లో లక్షలు రావడంతో.. ఇంకా వస్తాయన్న ఆశతో ఇంకా ఎక్కువ బెట్టింగ్ కాశాడు. ఓవైపు కోట్లు పోతున్నాయని తెలిసినా.. ఆ వ్యసనంలో పూర్తిగా కోల్పోయాడు. రియల్ ఎస్టేట్‌లో సంపాదించింది పోగొట్టుకోవడమే కాకుండా… అప్పులు చేసి మరీ చేతులు కాల్చుకున్నాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఒక్కడే వంద కోట్లు కోల్పోయాడంటే టోటల్ బెట్టింగ్స్‌లో ఎన్ని వందల కోట్లు కోల్పోయి ఉంటారు?

ఒక్క హైదరాబాద్‌లోనే క్రికెట్ బెట్టింగ్స్ టర్నోవరల్ కోట్లకు కోట్లు ఉంటుందని అంచనా. బెట్టింగ్ ముఠాలు లక్షలు సంపాదించవచ్చని ఆశపెట్టించి, వారిని ముగ్గులోకి దించి, ఉన్నది మొత్తం పోగొట్టుకునేలా చేస్తోంది. ఈ బెట్టింగుకు ఎంతగా బానిసలను చేస్తున్నారంటే.. ఓవైపు ఉన్నదంతా పోయినా సరే.. అప్పులు చేసి మరీ బెట్టింగులో పెట్టేంతగా.

Advertisement

హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో కోటి 41 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మొన్న ఉప్పల్ లో  ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా  పందెం రాయుళ్లు బరితెగించారు. రాజేంద్రనగర్ లోని మైలార్ దేవులపల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు రైడ్స్ చేశారు. ఈ దాడిలో రూ. 46 లక్షలు సీజ్ చేశారు.

ఓవైపు పోలీసులు బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేస్తున్నా సరే… హైదరాబాద్‌లోని ఏదో మూలన ఈ దందా జరుగుతూనే ఉంది. ఈ బిజినెస్ కోట్లలో జరుగుతుండడంతో.. ఆర్గనైజర్లు ప్లేసులు మార్చి మరీ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×