E-Paper
Advertisement

Bike Servicing Caution: బైక్ సర్వీసింగ్ చేయిస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Bike Servicing Caution: బైక్ సర్వీసింగ్ చేయిస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
Advertisement

Bike Servicing Caution| మధ్య తరగతి ఇళ్లలో అందరి వద్ద బైక్ లు ఉండడం సర్వసాధారణం. అయితే బైక్ పనితీరును మెరుగ్గా ఉంచుకోవాలంటే, మోటార్ సైకిల్ నడుపుతున్న సమయంలో మంచి మైలేజ్ పొందాలంటే, సకాలంలో బైక్ సర్వీసింగ్ చేయించడం అత్యంత అవసరం. చాలామంది తమ బైక్‌లను సమయానికి సర్వీస్ చేయించకుండా వదిలేస్తుంటారు. ఈ కారణంగా వారి బైక్ మైలేజ్ తగ్గుతుంది, పనితీరు కూడా దెబ్బతింటుంది అని వారు తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. బైక్‌కు ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీసింగ్ చేయాలి అనే అంశం చాలా కీలకం. ఈ విషయంలో స్పష్టత లేకపోతే మీరు అనవసర నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది.

బైక్ అయినా, స్కూటర్ అయినా ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే ఈ సమయంలో సర్వీసింగ్ చేయడం వల్ల బైక్ ఇంజిన్ జీవితకాలం పెరుగుతుంది. అలాగే బైక్ పనితీరు మెరుగవుతుంది. మీరు సరిగా సర్వీసింగ్ చేస్తూ ఉంటే, బైక్ లీటరు ఇంధనానికి ఎక్కువ కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక మీరు 2000 కిలోమీటర్లలో సర్వీస్ చేయకపోతే, కనీసం 2500 కిలోమీటర్లకు లోపుగా తప్పనిసరిగా చేయాలి.

Advertisement

అయితే మీరు ఈ వ్యవధిని మించి వాయిదా వేస్తే, బైక్ పిస్టన్, క్లచ్ ప్లేట్, చైన్ వంటివి పాడయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇందువల్ల మరమ్మత్తుల ఖర్చులు అధికమవుతాయి. ఉదాహరణకు, పిస్టన్ రిపేర్‌కి సుమారు రూ.3,000 ఖర్చవుతుంది. పిస్టన్ రిపేర్ తోపాటు క్లచ్ ప్లేట్ రిపేర్ కూడా చేయాలంటే రూ.4,500 వరకు ఖర్చు రావచ్చు. ఇంకా ఇంజిన్ పూర్తిగా చెడిపోతే రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ఖర్చవుతుంది.

ఇప్పటికీ చాలామంది ఈ విషయంలో అప్రమత్తంగా లేరు. ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని కొత్త మోడళ్ల బైక్‌లు 5000 కిలోమీటర్ల వరకు సర్వీసింగ్ అవసరం లేకుండా ఉండేలా రూపొందించబడ్డాయి. కానీ ఇప్పటికీ ఎక్కువగా వాడుతున్న బైక్‌లు 2000 నుండి 2500 కిలోమీటర్ల మధ్య సర్వీసింగ్ అవసరం ఉన్నవే.

Advertisement

అందువల్ల, మీ బైక్‌కు అవసరమైన సమయంలో సర్వీసింగ్ చేయించుకోవడం ద్వారా మీరు పెద్ద ఖర్చులు తప్పించుకోవచ్చు, ఇంజిన్‌ను మెరుగ్గా నిర్వహించవచ్చు, అలాగే మంచి మైలేజ్‌ కూడా పొందవచ్చు.

Also Read: ఆండ్రాయిడ్ 16.. ఫీచర్లు, డిజైన్ ఇక అన్నీ ఛేంజ్.. యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్

బైక్ టైర్లు కూడా మార్చాలి.. ఎప్పుడంటే?..

బైక్ టైర్లను సకాలంలో మార్చడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది సురక్షితమైన ప్రయాణానికి, మెరుగైన నియంత్రణకు దోహదపడుతుంది. సాధారణంగా 25,000 నుంచి 30,000 కి.మీ. తర్వాత టైర్లను మార్చాలి, అయితే రోడ్డు పరిస్థితులు, రైడింగ్ శైలి, వాతావరణం వంటి అంశాలు ఈ దూరాన్ని ప్రభావితం చేస్తాయి. టైర్‌పై ఉబ్బెత్తు, పగుళ్లు కనిపిస్తే, మృదువైన రోడ్లపై కంపనాలు అనిపిస్తే, ట్రెడ్ ఇండికేటర్ బార్ ఉపరితలంతో సమానమైతే లేదా ట్రెడ్ మందం 1.6 మి.మీ. కంటే తక్కువైతే వెంటనే టైర్లను మార్చాలి.

అరిగిపోయిన టైర్లను మార్చకపోతే ప్రమాదాలు, బ్రేకింగ్ సమస్యలు, అస్థిరత, తరచూ పంక్చర్లు, మైలేజ్ తగ్గడం వంటి నష్టాలు సంభవిస్తాయి. కొత్త టైర్లు రోడ్డుపై మెరుగైన పట్టును, సురక్షిత ప్రయాణాన్ని, మంచి మైలేజ్‌ను, తక్కువ ఖర్చును అందిస్తాయి. ట్రెడ్ ఫ్లాట్ అయినా, పగుళ్లు లేదా కోతలు కనిపించినా, వింత కంపనాలు లేదా జారడం అనిపించినా, లేదా టైర్లు 4-5 సంవత్సరాల కంటే పాతవైతే, వెంటనే టైర్లను మార్చాల్సిన సమయమని గుర్తించాలి. సమయానికి టైర్లు మార్చడం ద్వారా సురక్షితంగా, ఆర్థికంగా ప్రయాణించవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×