E-Paper
Advertisement

ECA On Oil Companies: చమురు సంస్థలపై ఈసీ యాక్ట్.. కృత్రిమ కొరత లేకుండా కేంద్రం అలర్ట్

ECA On Oil Companies: చమురు సంస్థలపై ఈసీ యాక్ట్.. కృత్రిమ కొరత లేకుండా కేంద్రం అలర్ట్
Advertisement

ECA On Oil Companies: ఇరాన్ , ఇజ్రాయెల్ వార్ సామాన్యులపై భారం పెంచేస్తుంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరగడం స్టార్ అయ్యాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు కూడా పెరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ లాక్ చేయడంతో ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కేంద్రం అలర్ట్ అయింది.

ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్

వంట గ్యాస్ నిరంతరాయంగా సరఫరా అయ్యేందుకు చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ యూనిట్లపై కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (ECA) ను ప్రయోగించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటీన్‌లతో సహా C3, C4 ఉత్పత్తిని ఎల్పీజీ గ్యాస్ కోసం ఉపయోగించాలని సూచించింది. దేశంలోని కంపెనీలు తమ ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తులను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లకు సరఫరా చేయాలని ఆదేశించింది.

ఎల్పీజీ నిరంతర సరఫరా

Advertisement

వంట గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆయిల్ రిఫైనరీ సంస్థలకు తెలిపింది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు తమ ఉత్పత్తులను పెట్రోకెమికల్ ఉత్పత్తి లేదా ఇతర ఉపయోగాల కోసం బదిలీ చేయకూడదని మంత్రిత్వ శాఖ నిషేధించింది. ప్రజా ప్రయోజనాల కారణంగా ఎల్పీజీని నిరంతరం ఉత్పత్తి చేయాలని కోరింది. ఎల్‌పీజీని వంటింటి అవసరాలకు మాత్రమే మాత్రమే సరఫరా చేయాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను కూడా కేంద్రం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read:  21 రోజుల తర్వాతే గ్యాస్ బుకింగ్.. కొత్త రూల్స్ ఇవే

25 రోజుల గ్యాప్ తో గ్యాస్ బుకింగ్

Advertisement

చమురు, గ్యాస్‌ సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. బ్లాక్‌ మార్కెట్ విక్రయాలను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్‌ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని నియమించింది. దేశంలో పెట్రో ధరలు ఇప్పటికిప్పుడు పెరగబోవని, చమురు కంపెనీల వద్ద సరిపడా నిల్వలున్నాయని కేంద్రం వెల్లడించింది. వచ్చే 6-8 వారాల వరకూ సరిపడిన ముడి చమురు, పెట్రో నిల్వలు ఉన్నాయని తెలిపింది. కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×