E-Paper
Advertisement

Sonia Gandhi Message to Delhi Voters: ఢిల్లీ ప్రజలకు సోనియా పిలుపు.. వాటిపై మా పోరాటం అంటూ మెసేజ్..

Sonia Gandhi Message to Delhi Voters: ఢిల్లీ ప్రజలకు సోనియా పిలుపు.. వాటిపై మా పోరాటం అంటూ మెసేజ్..
Advertisement

Sonia Gandhi Message to Delhi Voters During the Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 58 సీట్లకు ఆరో విడత పోలింగ్ శనివారం జరగనుంది. ఆరు రాష్ట్రాలతోపాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారోన న్నది ఆసక్తి రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి. అన్నింటిలోనూ బీజేపీ పోటీ చేస్తుండగా, కూటమి తరపున ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు చోట్ల బరిలోకి దిగాయి.

గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులను ఈసారి బీజేపీ మార్చేసింది. కాకపోతే ఢిల్లీ ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది. 2019లో బీజేపీకి విజయాన్ని కూడబెట్టిన హస్తిన ఓటర్లు, మరుసటి ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ వైపు మొగ్గు చూపారు. ఈసారి అక్కడ ఎన్నికల ఉత్కంఠబరితంగా సాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్‌పై ఆయన రావడం ఒక ఎత్తయితే, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఒకరు ఎంపీ స్వాతిమాలీవాల్‌పై దాడి చేయడం వంటి ఘటనలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.

Advertisement

ఇదిలావుండగా ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడిన వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ప్రజాస్వామం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎన్నికలు చాలా ముఖ్యమైవని గుర్తు చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి సమస్యలు తారాస్థాయికి చేరాయని వివరించారు. ఈ పోరాటంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని  విజ్ఞప్తి చేశారు.

Also Read: Blast in Gunpowder Factory : ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

Advertisement

ఢిల్లీతోపాటు  యూపీలోని-14, హర్యానా- 10, బీహార్-8, బెంగాల్-8, ఒడిషా-6, జార్ఖండ్- 4, జమ్మూకాశ్మీర్ ఒక్క స్థానానికి శనివారం ఉదయం పోలింగ్ మొదలుకానుంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తి అయ్యింది. రేపటితో ఆ సంఖ్య 486కు చేరుకోనుంది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×