E-Paper
Advertisement

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం సంచలన ప్రకటన!

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం సంచలన ప్రకటన!
Advertisement

Siddaramaiah: ఢిల్లీ నుంచి వెలువడిన ఓ తాజా ప్రకటన కర్ణాటక రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఆయన వయస్సు పైబడటం , ఆరోగ్యం సహకరించకపోవడమేనని తెలుస్తోంది. ఈ వయసులో ప్రత్యక్ష ఎన్నికల ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని భావించి, ప్రత్యక్ష పోరుకు దూరంగా ఉండాలని ఆయన భావించారు. దీనికి తోడు ప్రస్తుత రాజకీయాల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొరవడుతున్న నైతిక విలువలు కూడా ఆయనను కొంత అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం.

Advertisement

అయితే ఎన్నికల బరిలో నిలవకపోయినా.. రాజకీయాలకు మాత్రం గుడ్ బై చెప్పట్లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పార్టీ పరంగా, ప్రజా సమస్యల పట్ల తాను ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉంటానని పేర్కోన్నారు. గత 50 ఏళ్లుగా కర్ణాటక ప్రజలు తనపై చూపించిన ప్రేమాభిమానాలు, అందించిన మద్దతుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక ముఖ్యమైన మలుపుగా నిలవనుంది.

Also Read: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు యువకులు మృతి!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×