E-Paper
Advertisement

Sabarimala Devotees Insurance : శబరిమల భక్తులకు ఉచిత ప్రమాద బీమా.. నష్టపరిహారం ఎంతంటే?..

Sabarimala Devotees Insurance : శబరిమల భక్తులకు ఉచిత ప్రమాద బీమా.. నష్టపరిహారం ఎంతంటే?..
Advertisement

Sabarimala Devotees Insurance | కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాల్లో అయ్యప్ప భక్తులు మరణించడంతో, ఈ దుర్ఘటనల నేపథ్యంలో దేవస్థానం ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ బీమా పథకం ప్రకారం, యాత్రికులు ప్రమాదంలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తుంది.

మండలం మకర విలక్కు సీజన్ సమీపించడంతో, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఈ ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా, కొల్లం, అల్లప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో ప్రమాదంలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందుతుంది. ఇందుకోసం భక్తుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయబడలేదు.

Advertisement

వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి యాత్రికుడికి ఈ ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన ఒప్పందం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో కుదుర్చుకుంది. అదనపు జిల్లాలకు ఈ బీమా పథకాన్ని విస్తరించే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తెలిపారు.

శబరిమలలో పనిచేసే కార్మికుల కోసం కూడా మరో బీమా పథకాన్ని ప్రారంభించింది దేవస్థానం బోర్డు. ఈ పథకం ప్రకారం, శబరిమల ఆలయాన్ని శుభ్రపరిచే విశుధి కార్మికులు, పంపా నుంచి సన్నిధానం వరకు భక్తులను తీసుకుని వచ్చే డోలీ కార్మికులకు కూడా పరిహారం అందించబడుతుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిగా వైకల్యం అయితే రూ. 10 లక్షల పరిహారం, పాక్షిక వైకల్యానికి రూ. 5 లక్షల పరిహారం అందించబడుతుంది. ఈ బీమా పథకానికి భారతీయ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సహకారం అందిస్తోంది.

Advertisement

Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు

కానీ, ఈ బీమా పథకంలో కార్మికులు రూ. 499 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా, ఈ స్కీములో వారి పిల్లలకు వైద్య బీమా, విద్య వంటి మరిన్ని ప్రయోజనాలను అందించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. భక్తుల మరియు కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించడమే ఈ బీమా పథకాల ప్రధాన ఉద్దేశ్యం అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×