E-Paper
Advertisement

Remal Cyclone Update : బంగాళాఖాతంలో తుపాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

Remal Cyclone Update : బంగాళాఖాతంలో తుపాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
Advertisement

Remal Cyclone Update(Telugu news headlines today):

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. నేడు తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారి ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకు పడుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తుపానుకు రేమాల్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇది మే 26, ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్ లోని సాగర్ దీవుల్ని, బంగ్లాదేశ్ లోని ఖేపుపరా ప్రాంతాన్ని తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల సీజన్లో ఏర్పడిన తొలి తుపాను ఇదేనని తెలిపింది. తుపాను కారణంగా ప్రాణనష్టం పెద్దగా ఉండదని అంచనా వేసింది. కానీ.. బలమైన ఈదురుగాలులు, వర్షాల ధాటికి ఆస్తినష్టం గణనీయంగా ఉండొచ్చని పేర్కొంది.

తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మే 26,27 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, కోల్ కతా, హౌరా, హుగ్లీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర ఒడిశాపై కూడా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది. అలాగే మిజోరాం, త్రిపుర, మణిపూర్ లపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. బారీ వర్షసూచన నేపథ్యంలో ఒడిశాలో నాలుగు జిల్లాలను అప్రమత్తం చేశారు అధికారులు, భద్రక్, బాలాసోర్, మయూర్ భంజ్ జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. విపత్తు దృష్ట్యా సన్నాహక చర్యలు చేపట్టారు.

Advertisement

బెంగాల్, ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ లపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

మరోవైపు కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. 220 మంది ప్రజల్ని 8 పునరావాస కేంద్రాలకు తరలించారు. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుఝా, ఎర్నాకుళం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మే 9వ తేదీ నుంచి 23వ తేదీలోగా 11 మంది వర్షాల కారణంగా మరణించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×