E-Paper
Advertisement

Chennai Metro Accident: చెన్నై మెట్రో ప్రమాదంలో ఒకరు మృతి.. రామాపురం వద్ద ట్రాక్ కూలిపోయి..

Chennai Metro Accident: చెన్నై మెట్రో ప్రమాదంలో ఒకరు మృతి.. రామాపురం వద్ద ట్రాక్ కూలిపోయి..
Advertisement

Chennai Metro Accident| తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో వద్ద ప్రమాదం జరిగింది. ఈ దారుణ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్ II నిర్మాణంలో భాగమైన మౌంట్ పూనమల్లీ రోడ్డు సమీపంలోని.. డీఎల్‌ఎఫ్ రామాపురం వద్ద ఒక ట్రాక్ కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మోటార్‌సైకిల్ రైడర్ మరణించాడు. ఈ ఘటన మానపాక్కం ప్రాంతంలో.. ఎల్ అండ్ టీ హెడ్ ఆఫీస్ ప్రధాన గేట్ సమీపంలో జరిగింది. ఇక్కడ రెండు భారీ ఐ-గిర్డర్‌లు ఒక్కసారిగా కూలిపోయాయి.

చెన్నై మెట్రో రైలు లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఈ గిర్డర్‌లను సపోర్ట్ చేస్తున్న ఎ-ఫ్రేమ్ జారిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ గిర్డర్‌లు కేవలం వారం రోజుల క్రితం మెట్రో ప్రాజెక్ట్‌లోని కారిడార్ 4 నిర్మాణంలో భాగంగా స్థాపించబడ్డాయి.

Advertisement

మరణాన్ని ధృవీకరించిన సీఎంఆర్‌ఎల్.. విచారణ ప్రారంభం
సీఎంఆర్‌ఎల్ ఈ ప్రమాదంలో ఒక మోటార్‌సైకిల్ రైడర్ కూలిన శిథిలాల కింద చిక్కుకొని మరణించినట్లు ధృవీకరించింది. మోటార్‌సైకిల్‌పై ఒకే వ్యక్తి ఉన్నాడా? లేక వెనుక మరో పిలియన్ రైడర్ కూడా ఉన్నారా? అనే విషయంపై స్పష్టత రాలేదు. “దుర్ఘటనలో ఒక మోటార్‌సైకిల్ రైడర్ మరణించాడు. ఈ ఘటనపై మేం దిగ్భ్రాంతి చెందాం. మోటార్‌సైకిల్‌పై మరొకరు ఉన్నారా? అనేది తెలుసుకుంటున్నాం. మరణించిన వ్యక్తి కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం” అని సీఎంఆర్‌ఎల్ తెలిపింది. ఈ నిర్మాణ వైఫల్యానికి కారణం తెలుసుకునేందుకు పూర్తి విచారణ చేస్తామని సిఎంఆర్ఎల్ హామీ ఇచ్చింది. ఘటనా స్థలం నుంచి శిథిలాలను తొలగించడానికి, రోడ్డుపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి సీఎంఆర్‌ఎల్ తమ కాంట్రాక్టర్లతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.

కేసు నమోదు చేసిన పోలీసులు, ట్రాఫిక్‌కు అంతరాయం
ఏఎన్‌ఐ ప్రకారం.. చెన్నై పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదం మౌంట్ పూనమల్లీ రోడ్డు, ఒక ముఖ్యమైన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. శిథిలాలను తొలగించి, ప్రాంతాన్ని సురక్షితం చేసే వరకు వాహనాలను డైవర్ట్ చేశారు.

Advertisement

కారిడార్ 4 నిర్మాణం చివరి దశలో
ఈ ప్రమాదం పూనమల్లీ నుంచి పోరూర్ వరకు నిర్మాణం చివరి దశలో ఉన్న సమయంలో జరిగింది. కారిడార్ 4.. పూనమల్లీ నుంచి లైట్ హౌస్ వరకు 26.1 కి.మీ. విస్తరించి ఉంది. ఈ కారిడార్ చెన్నై మెట్రో రైలు ఫేజ్ IIలో కీలక భాగం. ఈ కారిడార్‌లోని పూనమల్లీ-పోరూర్ భాగం ఈ డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిఎంఆర్ఎల్ టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ఈ ప్రమాదం.. చెన్నైలో వేగంగా జరుగుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో నిర్మాణ భద్రతపై ఆందోళనలను లేవనెత్తింది.

Also Read: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. 10 నిమిషాలు లేటు కావడంతో లండన్ ఫ్లైట్ మిస్

ప్రస్తుతం అధికారులు కూలిన నిర్మాణాన్ని తిరిగి స్థాపించడానికి లేదా రిపేర్ చేయడానికి సమయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన వల్ల నిర్మాణ పనులు ఆలస్యం కావచ్చని, భద్రతా చర్యలపై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×