E-Paper
Advertisement

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?
Advertisement

MP News:  దేశవ్యాప్తంగా టూ వీలర్స్ వాహనదారులు హెల్మెంట్లు లేకుండా ప్రమాదాలు బారినపడి యువత అధికంగా మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం ట్రాన్స్‌పోర్టు మంత్రి గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ప్రమాదాలను అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా టూ వీలర్స్ వాహనదారులు పట్టించుకోలేదు. చివరకు హెల్మెంట్ లేని వారికి పెట్రోల్ ఇవ్వడం లేదు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.

దేశంలోని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా మెట్రో నగరాల్లో  టూ వీలర్స్ వాహనదారులకు కచ్చితంగా హెల్మెంట్ ఉండాల్సిందే. లేకుంటే పోలీసులు ఎక్కడికక్కడ ఫైన్ వేయడం చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేయడం చేస్తున్నారు. దీనివల్ల సిటీలో యాక్సిడెంట్ తగ్గినట్టు ఓ అంచనా.

Advertisement

ఇదే పద్దని మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. తాజాగా ఆగస్టు ఒకటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఇండోర్ నగరాల్లో నో హెల్మెంట్.. నో పెట్రోల్ ఆదేశాలను బంకులు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇది మిగతా జిల్లాలకు క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా భిండ్ జిల్లాకు పాకింది. అక్కడ నో హెల్మెంట్.. నో పెట్రోల్ కాన్సెప్ట్‌‌ని పెట్రోల్ పంపులు అమలు చేస్తున్నాయి.

ఈ రూల్ అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద వారిపై కఠినచర్యలు తప్పవని చెబుతున్నారు. వారానికి రెండు జిల్లాల చొప్పున ఈ రూల్స్ విధించడంతో ఈనెల చివరికి రాష్ట్రమంతా అమలు చేసే అవకాశముందని అంటున్నారు.

Advertisement

ALSO READ: కూలిన హెలికాఫ్టర్.. మంత్రులు మృతి

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. అయితే మరికొందరు తెర వెనుక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది వాహనదారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. హెల్మెట్ లేకుండా పెట్రోల్ కొనుగోలు చేయడానికి కొందరు ఈ రూల్స్‌ని పక్కదారి పట్టిస్తున్నారు.

హెల్మెట్‌లను కొద్ది గంటలపాటు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కూడా ఇండోర్‌లో వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై మీడియాకు చిక్కడంతో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి కొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా హెల్మెంట్ పద్దతి రావచ్చని అంటున్నారు విశ్లేషకులు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×