E-Paper
Advertisement

England : ఇంగ్లండ్‌లో ఇండియన్స్ హవా.. ఆ దేశ ప్రవాసుల్లో అత్యధికులు భారతీయులే

England : ఇంగ్లండ్‌లో ఇండియన్స్ హవా.. ఆ దేశ ప్రవాసుల్లో అత్యధికులు భారతీయులే
Advertisement

England : ఇంగ్లండ్ లో అన్ని రంగాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా భారతీయ ములాలున్న రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో అనేక మంది రాణిస్తున్నారు. అనేక మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.
ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశీయులే అని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది.అక్కడ నివసిస్తోన్న వారిలో 1.5 శాతం మంది భారతీయులేనని తెలిపింది. పాశ్చాత్య దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా పెరుగుతోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంగ్లండ్‌లోనూ భారతీయుల జనాభా పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది.

బ్రిటన్‌ జాతీయ గణాంక కార్యాలయ నివేదిక-2021 ప్రకారం ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న వారిలో విదేశీయుల సంఖ్య 2011లో 75 లక్షలుగా ఉంది. 2021 నాటికి విదేశీయుల సంఖ్య కోటికి చేరుకుంది. అంటే గత పదేళ్లలో బ్రిటన్ లో ప్రవాసుల సంఖ్య 25 లక్షలు పెరిగింది. బ్రిటన్ లో 2011లో భారతీయుల సంఖ్య 6 లక్షల 94 వేలుగా ఉంది. తాజాగా నివేదిక ప్రకారం అక్కడ 9 లక్షల 20 వేల మంది భారతీయులున్నారు. తర్వాతి స్థానంలో పోలండ్‌ దేశీయులు 7 లక్షల 43 వేల మంది ఉన్నారు.

Advertisement

లండన్‌లో నివసించే వారిలో ప్రతి 10 మందిలో నలుగురు విదేశీయులే ఉన్నారు.గత పదేళ్లలో బ్రిటన్‌కు వలస వచ్చిన వారి జాబితాలో మాత్రం రొమేనియా తొలిస్థానంలో ఉంది. 2011లో వారి సంఖ్య 80 వేలు ఉండగా.. ప్రస్తుతం 5 లక్షల 39 వేలకు చేరింది. రొమేనియా నుంచి పనికోసం వచ్చే పౌరులపై ఉన్న ఆంక్షలను 2014లో ఎత్తివేశారు. తర్వాత వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌, నైజీరియా, జర్మనీ, దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్ కు వలసలు పెరిగాయి. అమెరికా, జమైకా నుంచి వలసలు తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×