E-Paper
Advertisement

Kavitha: విచారణకు హాజరైన కవిత.. ఒకేసారి 9 మందిని ప్రశ్నించనున్న ఈడీ..

Kavitha: విచారణకు హాజరైన కవిత.. ఒకేసారి 9 మందిని ప్రశ్నించనున్న ఈడీ..
Advertisement

Kavitha: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులిచ్చింది. అయితే గురువారమే కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. దీక్ష ఉండడంతో 11న వస్తారని కోరారు. అందుకు ఈడీ అంగీకరించడంతో శనివారం భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహన్‌రావుతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.

కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో ఆమెకు నైతిక మద్ధతు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భారీగా సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్‌లతో సహా పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇక విచారణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.

Advertisement

ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లైలతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఇవాళ్టి విచారణలో కవితతో పాటు 9 మందిని ఒకసారి ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరవింద్‌లను ఒకేసారి విచారించనున్నట్లు సమాచారం.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×