E-Paper
Advertisement

Kerala Government: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు

Kerala Government: చిత్ర పరిశ్రమలో వేధింపులు.. విచారణ కోసం కమిటీ ఏర్పాటు
Advertisement

Kerala Government: మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆర్టిస్టులు ఆరోపించడం తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు పోలీస్ ఉన్నతాధికారులతో కూడిన ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం.

Also Read: తెలుగు ఎంతో అద్భుతమైన భాష.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

Advertisement

మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ ఓ నటి ఆరోపించారు. ఇదే సమయంలో ప్రముఖ డైరెక్టర్, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీకి చెందిన పలువురు రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన కేరళ ప్రభుత్వం .. పోలీసు అధికారులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఇందుకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×