E-Paper
Advertisement

India-US: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం

India-US: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం
Advertisement

India-US: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం తెలిపింది. మణిపూర్‌ అల్లర్ల తర్వాత దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అమెరికా పూర్తిగా పక్షపాత వైఖరితో నివేదిక ఇచ్చిందని భారత్ దుయ్యబట్టింది. అమెరికా ఇచ్చిన నివేదికకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఈ అంశం గురించి ప్రస్తావించారు. భారత్‌ ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో ఈ నివేదిక ద్వారా అర్థమవుతోందని తెలిపారు.

Advertisement

అందుకే అమెరికా నివేదికకు తాము ఎలాంటి విలువ ఇవ్వడం లేదని తెలిపారు. మానవ హక్కుల విధానాలపై అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో మణిపుర్‌ అల్లర్లను ప్రస్తావించింది. అయితే ఈ సమయంలోనే భారత్ లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది.

Also Read:రేపే రెండో దశ ఎన్నికల పోలింగ్‌.. ఓటర్లకు ఐఎండీ కీలక హెచ్చరికలు..!

Advertisement

మణిపూర్  ఘటనలను ప్రధాని మోదీ సిగ్గుచేటని అభివర్ణించడంతో పాటు..వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కులకు సంబంధించిన అంశాలను సైతం ఇందులో పేర్కొన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×