E-Paper
Advertisement

Kangana Ranaut: కంగనా రనౌత్ కు హై కోర్టు నోటీసులు.. మండి ఎన్నికల నిర్వహణపై సవాల్ చేస్తూ పిటీషన్!

Kangana Ranaut: కంగనా రనౌత్ కు హై కోర్టు నోటీసులు.. మండి ఎన్నికల నిర్వహణపై సవాల్ చేస్తూ పిటీషన్!
Advertisement

Kangana Ranaut latest news(Current news from India): హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం బిజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. హిమాచల్ రాష్ట్రంలోని మంది లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇటీవలే కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికలు గెలిచారు. కానీ ఆమె పోటీ చేసి ఎన్నికలు చెల్లవంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. మంది ఎన్నికల్లో తాను కూడా పోటీ చేసేందుకు నామినేషన్ వేశానని.. కానీ ఎన్నికల అధికారి అకారణంగా తన నామినేషన్ పేపర్లు తిరస్కరించాడని పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటీషన్ ని విచారణ కోసం అనుమతిస్తూ.. ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

మండి లోక్ సభ స్థానం నుంచి బిజేపీ ఎంపీ కంగాన్ రనౌత్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74,755 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అమెకు 5,37,002 ఓట్లు లభించగా.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య.. 4,62,267 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు చెల్లుబాటు కాదంటూ లాయక్ రామ్ నేగీ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. అటవీ శాఖ అధికారి ప్రభుత్వ ఉద్యోగం నుంచి ముందస్తు రిటైర్ మెంట్ తీసుకొని ఎన్నికల్లో పోటీచేశానని.. ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి తప్పుడు కారణాలతో తన నామినేషన్ దరఖాస్తు తిరస్కరించాడని కోర్టుకు తెలిపాడు.

Advertisement

పిటీషన్ లో లాయక్ రామ్ నేగీ.. ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై కూడా కేసు వేశాడు. నామినేషన్ ప్రక్రియ లో భాగంగా ఎన్నికల అధికారి.. తాను పనిచేసిన డిపార్ట్‌మెంట్ నుంచి ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ కూడా సమర్పించానని.. అయినా మరుసటి రోజు మళ్లీ కరెంటు, నీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని కేవలం ఒకరోజు గడువు ఇచ్చారని.. ఆ డాకుమెంట్స్ కూడా సమర్పిస్తే.. కారణం చూపకుండా తన నామినేషన్ తిరస్కరించారని పిటీషన్ లో పేర్కొన్నాడు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. కచ్చితంగా విజయం సాధించేవాడినని లాయక్ రామ్ నేగి వాదన.

Also Read:  ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!

Advertisement

ఇప్పుడు మంది నియోజకవర్త ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదని.. మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అతను దాఖలు చేసిన పిటీషన్ పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్పందిస్తూ.. కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించేందుకు ఆగస్టు 21 వరకు గడువు విధించింది.

 

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×