E-Paper
Advertisement

కొడుక్కి యాసిడ్ తాగించి.. ఘోరంగా చితకబాది.. హత్య చేసిన తల్లిదండ్రులు!

కొడుక్కి యాసిడ్ తాగించి.. ఘోరంగా చితకబాది.. హత్య చేసిన తల్లిదండ్రులు!
Advertisement

Parents Kills Son: గుజరాత్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును చంపడంతోపాటు అతడిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. జూన్ 30న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లిదండ్రులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

రాజ్ కోట్ జిల్లా గుండాల గ్రామంలో 23 ఏళ్ల రామ్ అనుమానస్పదంగా మృతి చెందాడు. తొలుత రామ్ ఆత్మహత్య చేసుకున్నట్లు అంతా భావించారు. తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని నమ్మించారు. తీరా పోస్ట్ మార్టంలో అతడు హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది. సొంత తల్లిదండ్రులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలడంతో రామ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు రామ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెళ్లైన 4 నెలలకు భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు డబ్బుకోసం రామ్.. తండ్రి బాబుబాయ్, తల్లి మనీషా బెన్ ను నిత్యం వేధించేవాడు. ప్రతీ రోజూ వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలో జూన్ 30న కూడా వారి మధ్య గొడవ చేటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన తల్లి.. మద్యంమత్తులో ఉన్న రామ్ చేత బలవంతంగా యాసిడ్ తాగించింది. అటు తండ్రి అతడిపై దాడి చేశాడు. చివరికి గొంతు నులిమి కొడుకు ప్రాణాలు తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.

Also Read: మరో ఘోరం.. పాయసంతో భర్తను లేపేసిన భార్య.. బాత్రూమ్ కింద కప్పెట్టి హైడ్రామా!

Advertisement

అయితే ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు బాబుబాయ్.. స్థానికంగా ఉన్న తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించాడు. గోండల్ సివిల్ ఆస్పత్రిలో త్వరితగతిన ప్యానెల్ పోస్ట్ మార్టం నిర్వహించాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. రిపోర్ట్ ను తారుమారు చేసేందుకు కూడా పలువురు లోకల్ లీడర్లను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అయితే శవపరీక్ష నివేదికలో హత్య అని తేలడం, భార్య ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: నిన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. స్వామి వారి కానుకలు మాయం?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×