E-Paper
Advertisement

G20 : భారత్‌కు G-20 అధ్యక్ష బాధ్యతలు.. దేశం గర్వించే సమయం: మోదీ

G20 : భారత్‌కు G-20 అధ్యక్ష బాధ్యతలు.. దేశం గర్వించే సమయం: మోదీ
Advertisement

G20 : G20 దేశాల అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతికి వచ్చాయి. ఇండోనేషియా నుంచి భారత్‌ జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. రెండురోజులపాటు ఇండోనేషియాలోని బాలిలో జి-20 సదస్సు జరిగింది. G20 బాధ్యతలు దేశానికి రావడం భారతీయులు గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో నుంచి G-20 అధ్యక్ష బాధ్యతలు అందుకుంటున్న చిత్రాన్ని విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విటర్‌లో షేర్ చేశారు. బాలిలో సమావేశమైన నేతలంతా ఉక్రెయిన్‌ తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు సూచించారు. ఈ అంశంపై డిక్లరేషన్‌ ప్రకటించారు. గతంలో రష్యాకు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రస్తావించారు. అణుబెదిరింపులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్ లో పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఇది యుద్ధాల యుగం కాదని G20 దేశాలు స్పష్టం చేశాయి.

Advertisement

సెప్టెంబర్‌లో షాంఘై కోఆపరేషన్ సమ్మిట్‌కు హాజరైన సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అప్పుడు ఇది యుద్ధాల యుగం కాదని పుతిన్‌కు మోదీ సూచించారు. యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తానని పుతిన్ చెప్పారు. అప్పుడు మోదీని ప్రపంచదేశాలు ప్రశంసించాయి. వివిధ దేశాల మీడియాలు మోదీ స్టేట్ మెంట్ ను ప్రస్తావించాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×