E-Paper
Advertisement

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..
Advertisement

Mask Rule: ఇకపై విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదేనని సూచించింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం వారి ఇష్టమేనని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేశారు. ఇకపై విమానాల్లో మాస్క్ లు ధరించకపోయినా ప్రయాణికులకు ఎలాంటి జరిమానాలు , శిక్షలు ఉండవని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

Advertisement

దేశంలో బుధవారం 501 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 7,561 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. దీంతో విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. ఇప్పటికే కరోనా విషయంలో దాదాపు అన్ని నిబంధనలను కేంద్రం సడలించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×