E-Paper
Advertisement

Assembly Elections 2023 : ఆ రోజున భారీగా పెళ్లిళ్లు.. ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు

Assembly Elections 2023 : ఆ రోజున భారీగా పెళ్లిళ్లు.. ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు
Advertisement

Assembly Elections 2023 : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ తేదీలను ప్రకటించారు. పోలింగ్ తేదీలు ప్రకటించిన రెండు రోజులకే ఒక రాష్ట్రంలో పోలింగ్ తేదీని మార్చుతూ నేడు మరో ప్రకటన చేసింది ఈసీ.

రాజస్థాన్ లో పోలింగ్ నిర్వహించే తేదీలో (Rajastan Polling Day) మార్పు జరిగింది. సోమవారం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు రాష్ట్రంలో భారీగా పెళ్లిళ్లు ఉండడంతో పోలింగ్ తేదీలో మార్పు చేసింది ఈసీ. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

రాజస్థాన్ లో నవంబర్ 23న సుమారు 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయట. అదేరోజు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమైంది. కానీ.. భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలున్నాయని, పోలింగ్ తేదీని మార్చాలంటూ రాజస్థాన్ బీజేపీ ఈసీని ఆశ్రయించింది. ఓటింగ్ శాతం తగ్గుతుందన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ.. ఈ మేరకు నవంబర్ 25న పోలింగ్ చేపట్టేలా షెడ్యూల్ లో మార్పు చేసింది. డిసెంబర్ 3న యథావిధంగా కౌంటింగ్ ఉంటుందని తెలిపింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×