E-Paper
Advertisement

Delhi Coaching centres:ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఎఫెక్ట్..13 కేంద్రాలు క్లోజ్

Delhi Coaching centres:ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఎఫెక్ట్..13 కేంద్రాలు క్లోజ్
Advertisement

Delhi floods effect..13 coaching centres close :ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా తయారయింది ఢిల్లీ కోచింగ్ సెంటర్ల పరిస్థితి. మొన్నటి శనివారం ఢిల్లీలో చోటుచేసుకున్న వరద సంఘటనలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.రావూస్ కోచింగ్ సెంటర్ పేరుతో నడిపిస్తున్న ఈ కోచింగ్ సెంటర్ పై పలు కేసులు నమోదయ్యాయి. తీవ్ర రాజకీయ దుమారం చెలరేగి అది కాస్తా రాజకీయ రంగును పులుముకుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం అంతా బీజేపీ అధికారంలోనే ఉంది. ఇదంతా ఢిల్లీ నగరపాలక సంస్థ నిర్లక్ష్యమే అంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా చేసుకుని బీజేపీని దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా ఆప్ నేతలు, కాంగ్రెస్ నేతలు బీజేపీపై గుర్రుగా ఉన్నాయి. సరైన సమయంలో బీజేపీ నేతలు దొరికారని..ఇక ఈ విషయాన్ని రాద్దాంతం చేసేదాకా వదలకూడదని భావిస్తున్నాయి.

ముందు జాగ్రత్త చర్యలు

Advertisement

దీనితో అధికారులకు బీజేపీ నేతలు హుకుం జారీ చేశారు. వేటు వేయడానికి కూడా వెనకాడబోమని బెదిరించారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు రావూస్ కోచింగ్ సంఘటన దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. చుట్టు పక్కల కోచింగ్ సెంటర్లు నడిపిస్తున్న కార్యాలయాలపై దాడులు జరిపారు. వీరంతా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, సరైన ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని, మరికొన్ని అనుమతులు లేకుండానే కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారని వివిధ కేసుల కింద దాదాపు 13 కోచింగ్ సంస్థలను సీజ్ చేశారు. వాటికి అధికారులు సీల్ వేశారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహించే కోచింగ్ సెంటర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు.

మేయర్ ఇంటి ముట్టడి

Advertisement

నగరంలో వరద పరిస్థితిని అంచనా వేయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నగర మేయర్ ఇంటినిముట్టడించారు. బాధితులకు న్యాయం జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులను సస్సెండ్ చేయాలని కోరుతూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×