E-Paper
Advertisement

Kangana Ranaut: కంగనా రనౌత్ కండీషన్స్‌పై కాంగ్రెస్ ఫైర్

Kangana Ranaut: కంగనా రనౌత్ కండీషన్స్‌పై కాంగ్రెస్ ఫైర్
Advertisement

Kangana Ranaut comments on Congress(Telugu news updates): బాలీవుడ్ నటి, మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్య నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి తన పేరు తెరమీదకు వచ్చింది. తనని కలిసేందుకు వచ్చే ప్రజలందరూ ఆధార్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలని మీడియా సమావేశంలో కోరింది. అంతేకాదు నన్ను కలవాలంటే మండీ నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్ తెచ్చుకోవాలంటూ సూచించింది. అలాగే నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో కూడా ఆ కారణాన్ని ఓ పేపర్‌పై రాయాలని సూచించారు. దాంతో నాకు ఎలాంటి ఇబ్బంది కలగదని సూచించింది.

హిమాచ్‌ల్‌ రాష్ట్రంలోని ఉత్తర దిశ ప్రాంత ప్రజలందరూ తనని కలిసేందుకు మనాలిలోని తన ఇంటికి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చని తెలిపింది. మండీ ప్రజలు అయినట్లయితే నేరుగా తన కార్యాలయానికి రావొచ్చని తెలిపింది. ఈ ప్రాంతానికి టూరిస్ట్‌లు చాలా మంది వస్తుండటంతో కంపోర్ట్‌గా ఫీల్ అవడం లేదని అంతేకాకుండా సామాన్యులు సైతం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారని ఆమె తెలిపింది. అందుకే తనని కలిసేందుకు వచ్చే వారంతా తమ ఆధార్‌ని వెంట తెచ్చుకోవాలని సూచించింది.

Advertisement

Also Read:సుప్రీం కోర్టు బెయిల్ మంజూర్ చేసినా.. జైలులోనే కేజ్రీవాల్.. ఎందుకంటే?

కంగనా రనౌత్ చేసిన ఈ డిమాండ్‌ని కాంగ్రెస్ నేత విక్రమాధిత్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు కంగనాను కలవాలంటే ఆధార్ కార్లు ఎందుకని మండిపడ్డారు. ఓటు వేసేటప్పుడు అడగని ఈ కండీషన్‌లు ఇప్పుడు ఎందుకంటూ విమర్శించారు. మేం ప్రజాప్రతినిధులం. కాబట్టి రాష్రంలోని ప్రజలంతా తనని కలవడానికి రావొచ్చని అన్నారు. ప్రజలు ఏమన్నా పనిలేక వస్తారా..? పని ఉంది కాబట్టి అందులోనూ వారి సమస్యలను తెలిపేందుకే కంగనా దగ్గరికి వస్తారని.. అంతమాత్రానా కండీషన్స్‌ పెట్టడం నాకు నచ్చలేదని తన పద్దతిని ఇప్పటికైనా మార్చుకోవాలని విక్రమాధిత్య కంగనాకు సూచించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×