E-Paper
Advertisement

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు.. 5 ఏళ్ల జైలు శిక్ష

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు.. 5 ఏళ్ల జైలు శిక్ష
Advertisement

Sheikh Hasina: భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన ఒక కీలక కేసులో.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్ల జైలు శిక్ష, మేనకోడలికి రెండు సంవత్సరాల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాదు, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 14 మందికి కూడా ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు.

ఢాకాలోని ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ప్రభుత్వ భూములను అక్రమంగా కేటాయించి కోట్ల రూపాయల మేరకు అక్రమ లాభాలు పొందినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఈ భూ కేటాయింపుల వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు దోష నిర్ధారణ చేస్తూ శిక్షలను విధించింది.

Advertisement

ఈ కేసులో షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భూముల కేటాయింపులో రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకుని.. చట్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. కోర్టు విచారణ సమయంలో కీలక పత్రాలు, బ్యాంకింగ్ లావాదేవీల రికార్డులను ఆధారాలుగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.

ఈ తీర్పుతో బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న షేక్ హసీనా పై మరోసారి జైలు శిక్ష పడటం ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తీర్పుపై హసీనా కుటుంబం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కావాలనే ఇలాంటి ఆరోపణలు మోపుతున్నారని వారు మండిపడ్డారు.

షేక్ హసీనా సోదరి షేక్ రెహానా, మేనకోడలు సహా కుటుంబ సభ్యులపై శిక్షలు విధించడాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. తమపై మోపిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, న్యాయపోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. పై కోర్టును ఆశ్రయించి తీర్పును సవాలు చేస్తామని కూడా స్పష్టం చేశారు.

Also Read: కరిచేవాళ్లు లోపలే ఉన్నారు.. పెంపుడు కుక్కతో పార్లమెంటులోకి రేణుకా చౌదరి

మరోవైపు ప్రభుత్వం, ప్రాసిక్యూషన్ వర్గాలు మాత్రం ఈ తీర్పును స్వాగతించాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారెవ్వరైనా చట్టం ముందు సమానమేనని, రాజకీయ హోదాలు, కుటుంబ నేపథ్యం శిక్షల నుంచి తప్పించలేవని వారు వ్యాఖ్యానించారు. అవినీతి నిరోధక చర్యల్లో ఇది కీలక ముందడుగు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×