E-Paper
Advertisement

Old Age Home Atrocity: దుస్తులు లేవు, చేతులు కాళ్లకు బేడీలు.. వృద్ధాశ్రమంలో దారుణ స్థితిలో 39 మంది

Old Age Home Atrocity: దుస్తులు లేవు, చేతులు కాళ్లకు బేడీలు.. వృద్ధాశ్రమంలో దారుణ స్థితిలో 39 మంది
Advertisement

Old Age Home Atrocity| సమాజానికి భారంగా మారిన వారు, కుటుంబసభ్యులు వెలివేసిన వారు వృద్ధాశ్రమంలో శరణు పొందుతారు. అలాంటి ఒక వృద్ధాశ్రమంలో ఆ అనాథల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. తమకంటూ ఎవరూ లేని ఆ వృద్ధులను చేతులు, కాళ్లకు బేడీలు వేసి గదులలో బంధించారు. కొందరికి ఒంటిపై బట్టలు కూడా లేవు. మరికొందరైతే చాలీచాలని, చిరిగిన బట్టల్లో ఉన్నారు. వారు వేసుకున్న బట్టల్లోనే మల మూత్ర విసర్జనలు కూడా చేసి ఉన్నారు. ఇంతటి దయనీయ స్థితిలో ఆకలితో అలమటిస్తూ ఉండగా.. వారిని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో జరిగింది.

ఢిల్లీ సమీపంలోని నోయిడా సెక్టార్ 55లోని ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులు దయనీయ స్థితిలో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆశ్రమంలో వృద్ధులను గదుల్లో బంధించడం, సరైన సిబ్బంది లేకపోవడం, కొందరు మూత్రం, మలంతో తడిసిన బట్టలతో ఉండటం, మరికొందరినైతే బట్టలు లేకుండా గదుల్లో పెట్టి బంధించారు. ఈ దారుణ పరిస్థితులను చూపే ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను లక్నో సామాజిక సంక్షేమ శాఖకు కూడా పంపారు. వీడియోలో ఒక వృద్ధ మహిళ చేతులు వేసి.. ఒక గదిలో నిర్బంధించి కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్, నోయిడా పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి 39 మంది వృద్ధులను రక్షించారు.

Advertisement

అధికారులు ఆశ్రమానికి చేరుకున్నప్పుడు, చాలా మంది వృద్ధులు తమ బట్టలతో కట్టివేయబడి, గదుల్లో బంధించబడి ఉన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మీనాక్షి భరాలా మాట్లాడుతూ.. కొంతమంది వృద్ధ పురుషులను బేస్‌మెంట్ లాంటి గదుల్లో బంధించారని తెలిపారు. చాలా మంది వృద్ధ పురుషులు బట్టలు లేకుండా ఉండగా.. మహిళలకు పాక్షికంగా బట్టలు ఇవ్వబడ్డాయి. చాలా మంది వృద్ధుల బట్టలు మూత్రం లేదా మలంతో తడిసి ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆమె “నరకం కంటే దారుణం” అని వర్ణించారు. దాడి సమయంలో ఒక వృద్ధ మహిళ చేతులు కట్టివేయబడి ఉంది. చాలా మంది వృద్ధ పురుషులు బట్టలు లేకుండా, సరైన సంరక్షణ లేకుండా కనిపించారు.

సిబ్బంది లోపం
ఆశ్రమంలో వృద్ధుల సంరక్షణ కోసం సరైన సిబ్బంది లేరని అధికారులు గుర్తించారు. ఆనంద్ నికేతన్ ట్రస్టీ నీలేమ్మ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. ఒక వృద్ధ మహిళను కట్టివేసిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించామనితెలిపారు. ఆ వృద్ధ మహిళ మానసికంగా అస్థిరంగా ఉందని, స్వీయ హాని నివారించడానికి ఆమెను కట్టివేయడం జరిగిందని చెప్పారు. అయితే, వైరల్ వీడియో, ఆకస్మిక తనిఖీల వెనుక వ్యక్తిగత కక్ష సాధింపు ఉందని ఆమె ఆరోపించారు. ఆశ్రమంలో ఒక ఉద్యోగి తనను నర్సుగా చెప్పుకుంది. కానీ ఆమె కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదివినట్లు తెలిసింది.

Advertisement

ప్రాథమిక విచారణలో.. ఆశ్రమం వృద్ధుల కుటుంబాల నుండి రూ. 2.5 లక్షల విరాళం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాక, ఆహారం మరియు వసతి కోసం నెలకు రూ. 6,000 వసూలు చేస్తున్నారు. ఈ ఆశ్రమంపై కేసు నమోదు చేయబడింది. వృద్ధులను కొద్ది రోజుల్లో ప్రభుత్వ వృద్ధాశ్రమానికి తరలించనున్నారు. ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘటన వృద్ధుల సంరక్షణలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. వృద్ధాశ్రమాలలో సరైన సౌకర్యాలు, శిక్షణ పొందిన సిబ్బంది, మానవీయ విధానం అవసరమని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అధికారులు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుని, వృద్ధుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×