E-Paper
Advertisement

Assembly Elections 2026: రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. కేరళం, అసోం, పుదుచ్చేరి ఎంతంటే..

Assembly Elections 2026: రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. కేరళం, అసోం, పుదుచ్చేరి ఎంతంటే..
Advertisement

Assembly Elections 2026: అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీనికితోడు మూడు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Advertisement

గురువారం అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం వివరాలు మేరకు అస్సాంలో 85.38 శాతం కాగా,  2016 నాటి 84.67 శాతం మునుపటి రికార్డును అధిగమించింది.  2021లో 82.04 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

పుదుచ్చేరిలో 89.83 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు తెలిపింది.  2011లో నమోదైన 86.19 శాతం గరిష్ట స్థాయిని అధిగమించింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కేరళలో 78.03 శాతం పోలింగ్ నమోదైంది. 2021లో 76 శాతం మాత్రమే నమోదు అయ్యింది.

Advertisement

అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్ శాతం

ఉప ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని బాగల్కోట్ నియోజకవర్గంలో 68.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక దావణగెరె సౌత్‌లో 68.55 శాతం కాగా, నాగాలాండ్‌లోని కోరిడాంగ్‌లో 82.21 శాతం, త్రిపురలోని ధర్మనగర్‌లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. మిగతా కమిషనర్లు డాక్టర్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ఈ ప్రాంతాల పోలింగ్ కేంద్రాలను లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×