E-Paper
Advertisement

MCD : ఢిల్లీలో కాషాయ కోట బద్దలు.. ఆప్ ఘన విజయం..

MCD : ఢిల్లీలో కాషాయ కోట బద్దలు.. ఆప్ ఘన విజయం..
Advertisement

MCD : ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఆప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 15 ఏళ్ల బీజేపీ పాలనను చరమగీతం పాడింది. మొత్తం 250 వార్డుల్లో 130 ఆప్ కైవసం చేసుంది. దీంతో మేయర్‌ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 97 వార్డులను దక్కించుకుంది. బీజేపీ ఢిల్లీ చీఫ్‌ ఆదేశ్ గుప్తా నియోజకవర్గం పటేల్‌ నగర్‌లోని నాలుగు వార్డుల్లోనూ కాషాయ పార్టీ ఓటమిపాలైది. ఇక కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా చతికిలపడింది. హస్తం పార్టీ కేవలం7 స్థానాలకు పరిమితమైంది. మరో నాలుగు చోట్ల ఇతరులు విజయం సాధించారు.

1958లో ఏర్పాటైన ఎంసీడీ ని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో దశాబ్దంన్నర పాటు భాజపానే అధికారంలో ఉంది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో గెలుపొందింది. అప్పుడు ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 వార్డులను కైవసం చేసుకున్నాయి.

Advertisement

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ.. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఆప్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌...

Advertisement

ఢిల్లీ అసెంబ్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను అరవింద్‌ కేజ్రీవాల్‌ పెకిలించారు. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ కూడా గద్దెదించారు. విద్వేష రాజకీయాలను ఢిల్లీ ప్రజలు ఇష్టపడటం లేదని రుజువైంది. స్కూళ్లు, ఆసుపత్రులు, విద్యుత్‌, పరిశుభ్రతకే వారు ఓటేశారు .

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×