E-Paper
Advertisement

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?
Advertisement

Bus Fire: తమిళనాడులో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరిబిగబట్టేలా చేసిన ఈ ఘటన జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది?
చెన్నై నుంచి మదురై వైపు బయలుదేరిన ఒక ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ కోచ్ బస్సు శనివారం తెల్లవారుజామున తమిళనాడులోని పెరంబలూరు జిల్లాకు చేరుకుంది. సరిగ్గా ఉదయం 5:30 గంటల ప్రాంతంలో, మంగళమేడు సమీపంలోని చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు ఇంజన్ భాగం నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు, ఆపై మంటలు వ్యాపించడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.
సమయస్ఫూర్తితో 23 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజాము సమయం కావడంతో వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో మంటలు చెలరేగుతున్నాయని గ్రహించిన డ్రైవర్, ఏమాత్రం ప్యానిక్ అవ్వకుండా వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులందరినీ నిద్ర లేపి, అత్యంత వేగంగా బస్సులోంచి కిందికి దించేశాడు. డ్రైవర్ చూపిన అద్భుతమైన సమయస్ఫూర్తి వల్ల 23 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
ప్రయాణికులు కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించి, వాహనం పూర్తిగా అగ్నిఆహుతి అయింది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా కాలి బూడిదైనప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అసలు కారణం ఏంటి?
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మంగళమేడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన వల్ల చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Also Read: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×