E-Paper
Advertisement

వామ్మో.. ప్రభాస్ రోజు తినే ఫుడ్ ఖర్చు అంతా.. ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా?

వామ్మో.. ప్రభాస్ రోజు తినే ఫుడ్ ఖర్చు అంతా.. ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా?
Advertisement

Prabhas:పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్న ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు..చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోయారు. ఈ ఏడాది ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. అలాగే మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఇలాంటి సమయంలో ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే 46 సంవత్సరాల వయసులో కూడా ఇంత యంగ్ గా, ఫిట్ గా ఉండడానికి అసలు కారణం ఏమిటి ? ఈయన డైట్ సీక్రెట్ ఏంటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వాటిని ఆయన పెద్దమ్మ, దివంగత సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రివీల్ చేశారు.

ప్రభాస్ కి ఇష్టమైన ఆహారంపై శ్యామలాదేవి కామెంట్..

శ్యామలాదేవి ప్రభాస్ గురించి మాట్లాడుతూ..” కృష్ణంరాజు లాగానే ప్రభాస్ కూడా భోజన ప్రియులు.. కనిపించిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడం ప్రభాస్ స్టైల్ .. ముఖ్యంగా షూటింగ్ సెట్లో కూడా ఒక్కడే తిన్న రోజులు అసలు లేవు. ఆయన చుట్టూ ఉండే 10 , 20 మందితో కలిసి భోజనం చేస్తారు. వారందరికీ ప్రభాస్ స్వయంగా భోజనం ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ప్రభాస్ కోసం స్పెషల్ గా ఒక కుకింగ్ టీం కూడా ఉంది. ఒక రోజులో సుమారుగా రూ.2లక్షల విలువైన ఫుడ్ ను ప్రిపేర్ చేసి సెట్ లో అందరికీ వడ్డిస్తారు. ముఖ్యంగా చేపలు, రొయ్యలు , చికెన్, మటన్, పీతలు వంటి వంటకాలు ఎక్కువగా చేయిస్తారు” అంటూ ప్రభాస్ ఆహారపు మెనూ, వాటి కాస్ట్ ను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు శ్యామలాదేవి.

Advertisement

ALSO READ:మంగ్లీ వివాదంలో ఊహించని మలుపు..పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు!

కృష్ణంరాజులో గొప్ప టాలెంట్.. అందుకే భోజన ప్రియులు..

ఇక అలాగే తన భర్త కృష్ణంరాజు అభిరుచుల గురించి మాట్లాడుతూ. ” కృష్ణంరాజు మంచి భోజన ప్రియులు . అతిధుల పట్ల అపారమైన ఆతిథ్యం చూపేవారు.. ఎవరైనా ఇంటికి వస్తే వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ముందుగానే అడిగి తెలుసుకుని, వండించి స్వయంగా వడ్డించేవారు..ఇంట్లో తయారు చేసే చేపల పులుసు , పులావ్, రసం, రొయ్యల కూర , బిర్యాని వంటి వంటకాలను ఎక్కువగా ఇష్టపడేవారు .ముఖ్యంగా చేపల పులుసు అంటే కృష్ణంరాజుతో పాటు ప్రభాస్ కి కూడా చాలా ఇష్టం . ఈస్ట్ , వెస్ట్ గోదావరి ప్రాంతాల నుండి పులస చేప దొరికితే వెంటనే ఇంటికి తీసుకొస్తారు. కృష్ణంరాజు గారు అయితే ఆహారాన్ని రుచి చూడకుండానే కేవలం వాసనతో ఉప్పు సరిపోయిందో లేదో చెప్పగలిగే వారు అంటూ శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం శ్యామలాదేవి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అటు కృష్ణంరాజు ఇటు ప్రభాస్ ఆహారపు అలవాట్లను.. ఇతరులకు వారు ఇచ్చే ఆతిథ్యం గురించి ఆమె చెప్పుకొచ్చారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×