E-Paper
Advertisement

అనకాపల్లిలో గాలివాన బీభత్సం.. ఇద్దరు కూలీల దుర్మరణం!

అనకాపల్లిలో గాలివాన బీభత్సం.. ఇద్దరు కూలీల దుర్మరణం!
Advertisement

Rain Tragedy: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో దీని ప్రభావం చాలా తీవ్రంగా కనిపించింది. జిల్లాలోని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో సుమారు అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమై, జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

ఈ ప్రకృతి విపత్తు సత్యవరం గ్రామంలో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు పొలంలో తమలపాకులు సేకరిస్తుండగా.. ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. ఆ వేగానికి పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు వారిపై విరిగిపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే తోటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హఠాత్తుగా వచ్చిన ఈ తుఫాను లాంటి వాతావరణం అన్నదాతలకు, సామాన్య ప్రజలకు భారీ నష్టాన్ని చేకూర్చింది.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×