E-Paper
Advertisement

YS Jagan: వైసీపీ కొత్త ప్రచారం.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు, టెన్షన్‌లో జగన్ !

YS Jagan: వైసీపీ కొత్త ప్రచారం.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు, టెన్షన్‌లో జగన్ !
Advertisement

YS Jagan: వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టేసిందా? ఆస్తుల వ్యవహారాన్ని తప్పించుకునేందుకు కొత్త పల్లవి ఎత్తుకుందా? ఆస్తుల వ్యవహారానికి – ఆయన బెయిల్‌ రద్దుకు ఎందుకు లింకుపెడుతోందా? జగన్‌కు బెయిల్ రద్దు అయ్యే అవకాశముందంటూ ఎందుకు ప్రచారం చేస్తోంది? జగన్‌కు అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

సింహం.. సింగిల్‌గా వస్తోందంటూ జగన్‌ను రెచ్చగొట్టారు.. ఆ పార్టీ నేతలు. నేతల ఆలోచనను అర్థం చేసుకోలేక పోయారు. నేతలంతా సైలెంట్ అయిపోయారు. అడ్డంగా బుక్కయ్యారు వైసీపీ అధినేత జగన్. సొంత వ్యవహారమేకాదు.. పార్టీ పరంగా మాట్లాడేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదు. జగన్ వ్యవహారశైలి వల్లే దూరంగా ఉన్నామన్నది కొందరి నేతల మాట.

Advertisement

గతంలోకి వెళ్థాం… గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు న్యాయస్థానం ముందు హాజరుకాలేదు జగన్. కార్యక్రమాలున్నాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో కచ్చితం గా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు జగన్ ఆస్తుల కేసుల విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో సీబీఐ ఛార్జిషీటు ఎప్పుడో దాఖలు చేసింది. వాటిపై విచారణ జరిగితే తీర్పు వచ్చే అవకాశముంది. విచారణ డిలే అవుతోంది. న్యాయమూర్తులు మారిపోవడంతో మరింత ఆలస్యమవుతోందని అంటున్నారు.

Advertisement

ALSO READ:  వైఎస్ఆర్‌కు, నీకు సంబంధం లేదు: షర్మిల

ప్రస్తుతానికి వచ్చేద్దాం.. షర్మిల-జగన్ ఆస్తుల వ్యవహారంలో అధినేతకు ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశ ముందని ప్రచారం ఊదరగొడుతోంది. జగన్ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తికి షర్మిలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. కుటుంబం ఆస్తులను వైఎస్ఆర్ జీవించిన్నపుడే పంపకాలు చేసేశారని అంటోంది.

చెల్లి షర్మిలపై ప్రేమతో సంపాదించిన ఆస్తిలో కొంత ఇస్తున్నారంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టేసింది. తన సొంత ఆస్తి అయినప్పుడు జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారంటూ ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. అధికార ప్రభుత్వం అండతో విజయమ్మను ముందుపెట్టి జగన్‌ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తున్నారన్నది అందులోని ప్రధాన పాయింట్.

గురువారం విజయనగరం వెళ్లిన జగన్, ఆస్తుల వ్యవహారాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలు అందరి ఇళ్లలో ఉన్నదేనంటూ ప్రజలకు కొత్త సందేశాన్ని ఇచ్చారు. మరి బెయిల్ రద్దు వ్యవహారం కూడా చాలా మంది ఇళ్లలో ఉన్నదేనని ఎందుకు తీసుకోలేపోతున్నారు? అన్నదే అసలు పాయింట్. మొత్తానికి జగన్ భయం వెనుక ఏదో సంకేతాలు ఉన్నాయనేది సుస్పష్టం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×