E-Paper
Advertisement

YS Sharmila: వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే సవాల్.. షర్మిల స్కెచ్ మామూలుగా లేదుగా!

YS Sharmila: వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే సవాల్..  షర్మిల స్కెచ్ మామూలుగా లేదుగా!
Advertisement

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్వర్‌పై ఇండియా బ్లాక్ ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానానికి వైకాపా మద్దతు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైకాపా చేసిన ఆరోపణలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని జగన్ ‘దొంగ ఏడుపులు’ ఏడుస్తున్నారని విమర్శిస్తూ.. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలని షర్మిల పేర్కొన్నారు. వైకాపా ఎంపీలందరూ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి సంతకాలు చేయాలని, అభిశంసన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాలని ఆమె సవాల్ విసిరారు.

Advertisement

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే దమ్ము జగన్‌కు ఉందా అని ఆమె ప్రశ్నించారు. కేవలం సాకులు చెప్పడమే కాకుండా, ఎన్నికల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ జగన్ తన వైఖరిని స్పష్టం చేయాలని షర్మిల స్పష్టం చేశారు. ఈ సవాల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈవీఎంల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

Also Read: తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన షాపులు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×