E-Paper
Advertisement

YS Jagan Tadepalli Palace: తాడేపల్లి ప్యాలెస్‌.. జురాసిక్ పార్క్? ఇంతకీ ఎవరా దొంగ పిల్లి? టీడీపీ యానిమేషన్ స్టోరీ వైరల్

YS Jagan Tadepalli Palace: తాడేపల్లి ప్యాలెస్‌.. జురాసిక్ పార్క్? ఇంతకీ ఎవరా దొంగ పిల్లి? టీడీపీ యానిమేషన్ స్టోరీ వైరల్
Advertisement

YS Jagan Tadepalli Palace: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. అయినా వారి అలవాట్లు ఇప్పటి నేతలు కంటిన్యూ చేస్తున్నారు. రాజకీయాల్లో ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కూడా. ప్రజల డబ్బును నేతలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పేందుకు ఇదొక ఎగ్జాంఫుల్.

పూర్వం రాజులు తమ ఇల్లు శత్రువులకు కనిపించకుండా పొడవైన గొడలు కట్టేశారు. ఎవరొచ్చినా, ఏం చేసినా బయటకు కనిపించేది కాదు. వాటి ఆనవాళ్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఏపీలో రాజుల పద్దతినే మన నాయకులు ఫాలో అవుతున్నారు. తాడేపల్లి మాజీ సీఎం జగన్‌ ప్యాలెస్‌కు  సంబంధించి కొత్త కొత్త విషయాలు బయట పెడుతోంది చంద్రబాబు సర్కార్.

Advertisement

2019 వైసీపీ అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు మరమ్మతులు చేసింది.  ప్రభుత్వం మనదేకదా.. అడిగేవారు ఎవరున్నారని భావించారు ఆనాటి పెద్దలు.  ఏకంగా 12.85 కోట్ల రూపాయలతో పనులు చేయించారు. ప్యాలెస్ లోపల విషయం కాసేపు పక్కనపెడదాం.

మాజీ సీఎం జగన్ ప్యాలెస్ చుట్టూ ఐరన్ పెన్సింగ్ నిర్మించారు. ఇంటికి నాలుగు వైపులా 30 అడుగుల ఎత్తైన పెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీని విలువ అక్షరాలా 12 కోట్ల పైమాటే. ఈ విషయాన్ని  ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో సహా బయటపెట్టింది చంద్రబాబు సర్కార్.

Advertisement

ALSO READ: నెక్ట్స్ టార్గెట్ జగన్.. సజ్జల జస్ట్ శాంపిల్, వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ప్లాన్

ఒకవిధంగా చెప్పుకోవాలంటే అదంతా ప్రజాధనం. కంచెకి క‌రెంటు స‌ర‌ఫ‌రా కూడా ఉంద‌ట‌. గడిచిన ఐదేళ్లు ప్యాలెస్ వైపు ఎవరు చూడకుండా ఉండేలా రోడ్లను సైతం బ్లాక్ చేసింది అప్పటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిబంధనలను తొలగించింది.

జగన్ క్యాంప్ ఆఫీసు ఫర్నీచర్ విషయంలో ప్రభుత్వానికి డబ్బులు ఇస్తామని చెప్పారు ఆ పార్టీ నేతలు. కంచె నిర్మాణానికి సంబంధించిన నిధులను ప్రభుత్వ ఖజానాకు ఆ పార్టీ జమ చేస్తుందా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

తాడేపల్లి ప్యాలెస్‌ కంచెకు సంబంధించి ఓ నిమిషం నిడివి గల యానిమేషన్ వీడియోను విడుదల చేసింది టీడీపీ. దొంగ పిల్లి కథతో భావి తరాలకు అర్థమయ్యేలా ప్యాలెస్ కంచె గురించి బాధ్యత గల తండ్రి, తన కొడుకును ఆ రోడ్డపై తీసుకుంటూ వివరించే ప్రయత్నం చేశాడు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×