E-Paper
Advertisement

Jagan At Banglore: యధావిధిగా బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద జగన్ ధర్నా

Jagan At Banglore: యధావిధిగా బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద జగన్ ధర్నా
Advertisement

టైటిల్ కామెడీగానే ఉండొచ్చు కానీ, ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ నిన్ననే ఏపీకి వచ్చి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట మేరకు ఎమ్మెల్సీలు మండలిలో రచ్చ చేశారు, మిగతా నాయకులు, కార్యకర్తలు వైసీపీ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీల వద్దకు వెెళ్లి గొడవ చేయాలనుకున్నారు. కొంతమంది హౌస్ అరెస్ట్ అయ్యారు, మిగిలిన కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి జగన్ ఎక్కడ, జగన్ బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద ధర్నా చేస్తున్నారట. ఈ జోక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ నేతలంతా ఏపీలో హడావిడి పడుతుంటే, జగన్ మాత్రం బెంగళూరులో రెస్ట్ తీసుకుంటున్నారు.

Advertisement

పోలీసుల అడ్డంకులు దాటుకుని..
పోలీసుల అడ్డంకులు దాడుకుని ఛలో మెడికల్ కాలేజీ అంటూ ఈరోజు సాక్షి మీడియాలో హడావిడి జరిగింది. సోషల్ మీడియా థంబ్ నెయిల్స్ అన్నిట్లో జగన్ హైలైట్ అవుతున్నారు. ఏదో పోరుబాటకు సిద్ధమైనట్టు.. సైనికులారా సిద్ధంకండి అన్నట్టుగా ఆయన ఫొటో ఉంటుంది. కానీ ఆయన మాత్రం సీన్ లోకి రారు. ఆయన ఆదేశాలు పాటించి నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి రావాలి, కానీ జగన్ మాత్రం యధావిధిగా ఇంట్లోనుంచి బయటకు రారు. అయితే వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మాత్రం జగనే ఈ ఆందోళనలను ముందుండి నడిపించినట్టుగా కలరింగ్ ఇస్తున్నారు.

Advertisement

నేనొస్తున్నా..
ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో జగన్ చెప్పిన మాట ఇది. త్వరలో జరగబోయే ధర్నాలలో తాను కూడా పాల్గొంటానని ఆయనే చెప్పారు. మాటిచ్చారు సరే, మరి దానిమీద నిలబడితే కదా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. అసెంబ్లీకి రారు, కనీసం రోడ్లపై నిరసన తెలిపేందుకు కూడా రారు. ఎంతసేపు అక్కడ మండలిలో ఎమ్మెల్సీలు పోరాడండి, ఇక్కడ రోడ్లపై నేతలు పోరాడండి అని సలహాలిస్తున్నారే కానీ, జగన్ ఏడీ? ఎక్కడా? అని వెదుకుతున్నారు నేతలు.

అసెంబ్లీ కథ కంచికేనా?
ఎన్నికలు వచ్చేస్తున్నాయి, వచ్చేస్తున్నాయంటూ ప్రెస్ మీట్లలో నేతల్ని బాగానే ఉత్సాహపరుస్తున్నారు జగన్. మరి ఎన్నికలు వచ్చేస్తుంటే జగన్ ఇంకా బెంగళూరులో ఎందుకు ఉంటున్నట్టు. కార్యక్షేత్రంలో దిగి పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేసుకోవాలి కదా. కానీ ఆయన మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ కేడర్ మాత్రం ఆయనకోసం సొంత పనులు మానుకుని రోడ్లెక్కాలి, ధర్నాలు చేయాలి. ఎంతకాలం ఈ డబుల్ గేమ్ అని వైసీపీలో అసంతృప్త స్వరాలు వినపడుతున్నాయి. ఇక అసెంబ్లీ విషయానికొస్తే జగన్ హాజరు కానంటూ మొండికేయడం సరికాదని వైసీపీలో సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. దానికి తగిన కారణాన్ని కూడా ఆయన చెప్పలేకపోతున్నారని, పోనీ ఆయన వెళ్లకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలనయినా స్థానిక సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి పంపించొచ్చు కదా అని అంటున్నారు. దీనికి జగన్ సమాధానం ఆల్రడీ చెప్పేశారు. కేవలం వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రమే మండలిలో పోరాటం చేయాలి అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే పరోక్షంగా ఎమ్మెల్యేలపై ఆయన ఆంక్షలు విధించారన్నమాట.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×