E-Paper
Advertisement

YS Bhaskar Reddy: ఆ లేఖపై ఎందుకు విచారణ చేయ్యట్లేదు.. నేను దేనికైనా రెడీ: భాస్కర్ రెడ్డి

YS Bhaskar Reddy: ఆ లేఖపై ఎందుకు విచారణ చేయ్యట్లేదు.. నేను దేనికైనా రెడీ: భాస్కర్ రెడ్డి
Advertisement

YS Bhaskar Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని గతేడాది సీబీఐ రెండు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ విచారణకు హాజరుకావాలని నోటీసుల పంపించింది. ఈమేరకు భాస్కర్ రెడ్డి విచారణ నిమిత్తం ఆదివారం కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైలులోని గెస్ట్‌హౌస్‌లో విచారణ జరగాల్సి ఉండగా.. అక్కడ సీబీఐ అధికారులు ఎవరూ లేకపోవడంతో భాస్కర్‌రెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

ఇక భాస్కర్ రెడ్డి రాకతో కడప సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదు? అని ప్రశ్నించారు. తనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నా కూడా తాను సిద్ధంగా ఉన్నానని భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×