E-Paper
Advertisement

Kotamreddy: జగనన్నా నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే… వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy: జగనన్నా నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే… వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Advertisement

Kotamreddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని తనకి లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ నుంచి పోటీకి తన మనసు అంగీకరించడం లేదని వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టిన విషయం 4 నెలల క్రితమే తనకు తెలుసని.. ఓ ఐపీఎస్ అధికారి తనకు చెప్పాడని కోటం రెడ్డి అన్నాడు. అయితే ముఖ్యమంత్రి జగన్‌పై కోపంతో ఆ అధికారి అలా చెప్పారని ముందుగా భావించానని తెలిపారు.

Advertisement

తనపై అనుమానం ఉన్న చోట ఉండాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయనని వెల్లడించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాప్ అయినట్లు తన దగ్గర స్పష్టమైన సాక్షాలు ఉన్నాయని.. ఆధారాలు బయటపడితే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకు ఇబ్బంది అవుతుందని తెలిపారు.

పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్న మాటను.. ముఖ్యమంత్రి జగన్ మాటలుగా భావిస్తున్నాని తెలిపారు. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది.. అని కోటంరెడ్డి అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×