E-Paper
Advertisement

Pendurthi : కరువైన న్యాయం.. పోలీస్ స్టేషన్ కు తాళం

Pendurthi : కరువైన న్యాయం.. పోలీస్ స్టేషన్ కు తాళం
Advertisement

Pendurthi : సామాన్యులకు న్యాయం జరగాలంటే .. పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. అయినా కూడా న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇప్పటికే చాలా నెగిటివిటీ ఉంది. ప్రభుత్వ సపోర్ట్ ఉన్నవారికి తప్ప సామాన్య ప్రజలకు న్యాయం జరగడం అనే మాటే ఉండదు. అలా పోలీసుల తీరుతో విసిగిపోయిన ఓ మహిళ.. తనకు న్యాయం చేయాలంటూ ఆ స్టేషన్ కే తాళం వేసింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో పెందుర్తిలో వెలుగుచూసింది.

పెందుర్తికి చెందిన గౌతమి పార్వతి అనే మహిళ తాను అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ ను కొనుక్కునేందుకు గ్రీన్ ట్రీ అపార్ట్ మెంట్ యజమానికి రూ. 5 లక్షలు ఇచ్చింది. అపార్ట్ మెంట్ రిజిస్ట్రేషన్ చేయలేదు సరికదా.. ఇళ్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేశాడు. తాను ఇచ్చిన రూ.5 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగితే.. తన సామాన్లు మొత్తం బయటపడేశాడు. దాంతో తనకు న్యాయం చేయాలంటూ పెందుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఐదు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. పోలీసులు తనకు న్యాయం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, అందుకే పోలీస్ స్టేషన్ కు తాళం వేశానని ఆమె తెలిపింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని, లేదంటే పోలీస్ స్టేషన్ ఎదుటే దీక్షకు దిగుతానని పార్వతి తెలిపింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×