E-Paper
Advertisement

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?
Advertisement

AP Liquor Case: ఏపీ లిక్కర్ కుంభకోణం క్లయిమాక్స్‌కి చేరిందా? సిట్ అధికారులు న్యాయస్థానంలో ఏం చెప్పారు? మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అప్రూవర్‌గా మారారా? ఈసారి ఎవరికైనా నేరుగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏపీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అప్పటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని ప్రశ్నించారు సిట్ అధికారులు. ఈ క్రమంలో కొన్ని విషయాలు ఆయన బయట పెట్టినట్టు తెలుస్తోంది. తాను తప్పు చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారాయన.

Advertisement

సిట్ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పానని శనివారం మీడియాతో ముందు ప్రస్తావించారు. ఈ కేసులో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఒకటి రెండుసార్లు లిక్కర్ పాలసీపై ఆయన అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో ఆయన అప్రూవర్‌గా మారినట్టు చెబుతున్నారు. అదే జరిగితే అధినేత మెడకు ఈ కేసు చుట్టుకోవడం ఖాయమని అంటున్నారు.

ఈ కేసులో కీలక నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పల బెయిల్ పిటిషన్ విషయంలో సిట్ కొన్ని విషయాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. దర్యాప్తు పూర్తి అయ్యిందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వలేమంటూ  నిందితుల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ లెక్కన మాజీ మంత్రి అప్రూవర్‌గా మారినట్టేనని అంటున్నారు.

Advertisement

ALSO READ: ఎమ్మెల్యే దగ్గుబాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. తరలివచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

అదే జరిగితే అంతిమ లబ్దిదారులు చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లే. ప్రస్తుతం నిందితులు ఇచ్చిన సమాచారాన్ని మరోసారి క్రోడీకరించే పనిలో నిమగ్నమైంది సిట్. అంతిమ లబ్దిదారుడికి నేరుగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  సిట్ నోటీసు ఇవ్వగానే హైకోర్టు‌ను ఆశ్రయిస్తారు. సిట్ వేసిన ఛార్జిషీటులో ఆనాటి సీఎంని చేర్చలేదు. కాకపోతే పలుమార్లు ప్రస్తావించింది.

లిక్కర్ వ్యవహారంలో ఇప్పటికే జగన్ చుట్టూ ఉండే కోటరీని అరెస్టు చేసింది. ఎంపీల నుంచి ఆ శాఖ మంత్రి వరకు విచారణ చేసింది. కాకపోతే ఓ ఎంపీని అరెస్టు చేసింది. మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారించింది. నేరుగా అంతిమలబ్దిదారుడి ఎవరో పని తేల్చేపనిలో పడిందట సిట్. సెప్టెంబరులో మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల నుంచి అరెస్టు ఖాయమనే ప్రచారం సాగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×