E-Paper
Advertisement

Python Snake: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన జనం

Python Snake: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన జనం
Advertisement

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ బయటపడటంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఒక డ్రైనేజీ కాలువలో నుంచి  పొలం లోకి ఇంజన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో అకస్మాత్తుగా సుమారు 20 అడుగుల పొడవైన భారీ కొండచిలువ బయటకు వచ్చింది. ఒక్కసారిగా కొండచిలువను చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు పరుగులు తీశారు.

అయితే జనసందోహాన్ని గమనించిన కొండచిలువ వెంటనే డ్రైనేజీ పక్కన ఉన్న పైపు మార్గంలోకి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది  కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

Advertisement

డ్రైనేజీ వ్యవస్థలో కొండచిలువ ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లలు, పశువులను డ్రైనేజీ వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో యనమదుర్రు గ్రామంలో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×