E-Paper
Advertisement

Strange Thief: వెరైటీ దొంగ.. చోరీ చేసి తప్ప తాగి.. అదే ఇంట్లో..

Strange Thief: వెరైటీ దొంగ.. చోరీ చేసి తప్ప తాగి.. అదే ఇంట్లో..
Advertisement

Strange Thief: విజయనగరం జిల్లా బొబ్బిలిలో.. ఒక విచిత్రమైన దొంగతన ఘటన చోటుచేసుకుంది. దొంగతనానికి వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో.. తన పని మరిచి ఇంట్లోనే నిద్రపోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఘటన ఎలా జరిగింది?
బొబ్బిలి పట్టణానికి చెందిన సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి.. వ్యవసాయ పనుల నిమిత్తం.. మూడు రోజుల క్రితం తన ఊరు వదిలి.. విజయనగరం జిల్లా అలజంగి అనే గ్రామానికి వెళ్లాడు. ఇది గమనించిన దొంగ ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. మూడు రోజుల నుంచి ఇంట్లోని వెండి, ఇత్తడి సామాన్లన్ని అమ్మకుంటూ మద్యం తాగుతూ ఇంట్లోనే నిద్రపోతున్నాడు.

Advertisement

దొంగ ఇంటిలోనే మత్తులో మునిగి
దొంగ తన పని ముగించాక బయటకు వెళ్లకుండా.. మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి మద్యం తాగాడు. మూడు రోజుల పాటు అతను అదే ఇంట్లో ఉన్నట్లు సమాచారం. చివరికి మద్యం మత్తులో మునిగి పడుకున్న వ్యక్తిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంటి యజమాని కనిపించకపోవడం, ఇంటి తలుపు తీయకపోవడం అనుమానం కలిగించడంతో స్థానికులు దగ్గరకి వెళ్లి చూస్తే, మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు.

పోలీసులకు సమాచారం
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నిద్రపోతున్న దొంగను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కొన్ని చోరీ చేసిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

విచారణ కొనసాగుతోంది
పోలీసులు ప్రస్తుతం అతని నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టారు. ఇతనికి మరోచోట్ల కూడా ఇలాంటి కేసులు ఉన్నాయా? ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి వెళ్లిన వ్యక్తి ఇంట్లోనే మత్తులో పడుకుని ఉండడం.. ఎంతలా నిర్లక్ష్యంగా ఉందో చెప్పుకుంటున్నారు.

Also Read: మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌..13 మంది విద్యార్థులపై వేటు, వారిలో..

ఇది కేవలం చోరీ మాత్రమే కాదు, మద్యం మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో ఓ ఉదాహరణ. నేరానికి పాల్పడిన వ్యక్తి బాధ్యత లేకుండా.. మద్యం మత్తులో ఇంట్లోనే తాగి పడుకోవడం.. చట్టాన్ని అవమానించినట్లే..  పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేసి, బాధితుడికి న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×