E-Paper
Advertisement

Vivekananda Murder Case: వివేకానంద కేసులో కొత్త మలుపు.. ఒకే రోజు రెండు పిటిషన్లు, ఏం జరుగుతోంది?

Vivekananda Murder Case: వివేకానంద కేసులో కొత్త మలుపు.. ఒకే రోజు రెండు పిటిషన్లు, ఏం జరుగుతోంది?
Advertisement

Vivekananda Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి కేసు అనేక మలుపులు తిరుగుతోందా? ఒకేసారి సుప్రీంకోర్టులో ఎందుకు రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి? నిందితులు మళ్లీ జైలుకి వెళ్లడం ఖాయమా? న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ సునీత. శుక్రవారం ఆ పిటీషన్ సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకొచ్చింది. దీనిపై విచారణ జరిగిన సుప్రీంకోర్టు, సీబీఐతోపాటు భాస్కర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

Advertisement

భాస్కర్ రెడ్డి తరపున వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అనారోగ్య సమస్యలు చూపిస్తూ న్యాయస్థానం నుంచి బెయిల్ పొందారు భాస్కర్‌రెడ్డి. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే వరకే సీబీఐ, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయన బెయిల్ రద్దుపై రెండు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

మరోవైపు వివేకానంద కేసును ఏపీ సర్కార్ దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా ఒకప్పటి వివేకా పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆయన చెప్పిన విషయాలను రికార్డు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో మరో నలుగురు జగన్ బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డితోపాటు అవినాష్ బాబాయ్ మనోహర్ రెడ్డి, తమ్ముడు అభిషేక్ రెడ్డి, వైఎస్సార్ ట్రస్టు ఛైర్మన్ జనార్థన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Advertisement

ALSO READ:  పవన్ జాతీయ నేత.. చంద్రబాబు వృద్దుడు.. నేను ఒప్పుకోనంటూ వైసీపీ ఎంపీ ట్వీట్

గురువారం విచారణకు రావాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఆయా వ్యక్తులు డుమ్మా కొట్టారు. దీంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది డిసెంబర్‌లో కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వివేకా కూతురు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్సీ రాంసింగ్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే కొద్దిరోజుల కిందట ఈ కేసు విచారించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఆపై నోటీసులు జారీ చేయడం చకచకా జరిగింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×