E-Paper
Advertisement

MV MAA Ship: విశాఖలో ఆ షిప్‌కు మోక్షం.. రెస్టారెంట్, బార్‌కు ఏర్పాట్లు.. పెళ్లిల్లూ, ఫంక్షన్లు కూడా..

MV MAA Ship: విశాఖలో ఆ షిప్‌కు మోక్షం.. రెస్టారెంట్, బార్‌కు ఏర్పాట్లు.. పెళ్లిల్లూ, ఫంక్షన్లు కూడా..
Advertisement

MV MAA Ship for Visakha Tourism: షిప్ లో పెళ్లి వేడుకలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవాలన్న కోరిక ఉందా? అలాగే షిప్ లో కూర్చొని తింటూ సముద్రం అందాలను తిలకించాలని ఉందా? అలాగే గ్లాసులో బీరుతో షిప్ లో నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా అయితే జస్ట్ వెయిట్.. కొద్ది రోజులు ఆగండి.. ఈ కోరికలన్నీ తీరే అవకాశం రానుంది. ఔను.. ఇది నిజం. బంగ్లాదేశ్ నుండి ఒడ్డుకు వచ్చిన ఓ షిప్ ను అధికారులు.. ఇలా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు.

విశాఖపట్నం లోని బీచ్ అందాలు ఎంత చూసినా తరగదు. అక్కడి బీచ్ అందాలకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. గుర్రపు స్వారీలు, రైడింగ్స్, ఇలా ఒకటేమిటి అక్కడ ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అందుకే విశాఖపట్నం వాసులే కాదు.. ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా వైజాగ్ బీచ్ అందాలు చూసేందుకు ఆసక్తి చూపుతారు. తాజాగా ఇదే బీచ్ లోని టెన్నేటి పార్క్ వద్ద సందర్శకులను ఆకర్షించేందుకు ఏపీ పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

2020 సంవత్సరంలో వచ్చిన తుఫాన్ ధాటికి విశాఖ నగరం గజగజ వణికింది. తుఫాన్ ధాటికి నగరంలోని కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం కాగా, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆ తుఫాన్ సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన ఎంవి మా అనే షిప్ ఒడ్డుకు చేరింది. ఈ షిప్ వైజాగ్ ఒడ్డుకు చేరిందని సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం, షిప్ ను తరలించే ప్రయత్నం చేశారు. అయితే షిప్ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో, అందులోని సామాగ్రిని వారు తీసుకువెళ్ళారు. ఆ సమయం నుండి షిప్ పార్క్ వద్దనే ఉంది.

ఈ షిప్ ను ఏపీ టూరిజం శాఖ స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఫిబ్రవరి 2021 లో గిల్ మెరైన్ సంస్థ నుండి టూరిజం శాఖ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ షిప్ ను తేలియాడే రెస్టారెంట్ గా మార్చేందుకు గత వైసీపీ ప్రభుత్వం రూ. 10.5 కోట్ల అంచనాతో ఆమోదించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, మళ్లీ షిప్ అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, తాజాగా షిప్ ను తేలియాడే రెస్టారెంట్ కంటే.. ఇదే షిప్ లో బార్, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్ గా మార్చాలని భావించింది. ఈ ప్రాజెక్ట్ కు అనుమతి కోసం టూరిజం శాఖ ప్రతిపాదనలను పంపించింది.

Advertisement

Also Read: TTD News: భక్తుల అమాయకత్వమే ఆయుధం.. తిరుమలలో మళ్లీ మోసం.. అసలేం జరిగిందంటే?

టెన్నెటి పార్క్ వద్ద షిప్ ను అభివృద్ధి పరిస్తే చాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ వాసులు కూడా షిప్ ను త్వరగా టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. షిప్ లో కల్పించే సౌకర్యాలు కల్పిస్తే చాలు, నగరవాసులకు స్పెషల్ టూరిజం ప్లేస్ గా పార్క్ నిలుస్తుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రజల కోరిక తీరాలంటే.. మరికొన్ని నెలలు ఆగాల్సిందే అంటున్నారు టూరిజం శాఖ అధికారులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×