E-Paper
Advertisement

Vijaysai: విజయసాయి ఐఫోన్ మిస్సింగ్.. అందుకేనా..?

Vijaysai: విజయసాయి ఐఫోన్ మిస్సింగ్.. అందుకేనా..?
Advertisement

Vijaysai: ఫోన్లు పోవడం కామన్. అయితే, ప్రముఖుల ఫోన్లు పోవడమనేది అస్సలే కామన్ కాదు. అందులోనూ, అల్లుడు అరెస్టై.. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న కీలక సమయంలో ఫోన్ పోవడం మరింత అనుమానాస్పదం అంటున్నారు. ఇంకెవరు, ఇద్దంతా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించే.

ఈ నెల 21 నుంచి విజయసాయిరెడ్డికి చెందిన ఐ ఫోన్ 12ప్రో కనిపించడం లేదంటూ.. ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫోను పోయిన సమయం, సందర్భం.. ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది.

Advertisement

ఇదే ఛాన్స్ గా టీడీపీ సెటైర్లు వేస్తోంది. అవునా, విజయసాయిరెడ్డి తాడేపల్లి ఎప్పుడు వెళ్లారు? ఈ నెల 21న ఆయన తాడేపల్లిలో ఉన్నట్టు ఎక్కడా అప్ డేట్ కూడా లేదు. ఇంతకీ ఫోన్ పోయిందా? లేదంటే, జగన్ లాగేసుకున్నారా? అంటూ ఓ టీడీపీ మాజీ మంత్రి పంచ్ లు వేశారు. ఫోన్ దాచేసి పోలీసులకు పోయిందంటూ ఫిర్యాదు చేశారనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. మరి, ఫోన్ ఎందుకు దాచేశారో కూడా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో సీబీఐ విచారణ లోతుగా సాగుతోంది. ఆ లిక్కర్ స్కాం లింకులు విజయసాయిరెడ్డికి ఉండబట్టే.. సీబీఐ వాళ్లు తన ఫోను సీజ్ చేస్తే గుట్టంతా రట్టు అవుతుందనే భయంతోనే ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేసి నాటకం ఆడుతున్నారనేది టీడీపీ ఆరోపణ. నిజమో కాదో తెలీదు కానీ.. నిజమే అన్నట్టుగా ఆ ప్రచారం సాగుతోంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×