E-Paper
Advertisement

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ
Advertisement

Vijayawada court: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పై రాయి విసిరిన కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్‌కు కోర్టు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

సీఎం జగన్ పై రాయి వేసింది సతీష్ కుమార్ అంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

సింగ్ నగర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిందితుడు సతీష్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. బాధితుడు సీఎం అయినందున సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Also Read: మహిళలూ జాగ్రత్త, జగన్ వస్తే ఆస్తులకు శఠగోపం

Advertisement

అయితే నిందితుడు సతీష్ ను అతని తరఫు న్యాయవాది, తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో నిందితుడు సతీష్ గురువారం నుంచి శనివారం వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×