E-Paper
Advertisement

Venkaiah Naidu : ‘పద్మ విభూషణ్ ‘.. నా బాధ్యతను మరింత పెంచింది..

Venkaiah Naidu : ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు కలిపాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Venkaiah Naidu : ‘పద్మ విభూషణ్ ‘.. నా బాధ్యతను మరింత పెంచింది..
Advertisement

Venkaiah Naidu : ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు కలిపాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచం మరోసారి భారత్‌ వైపు చూస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగి దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసేందుకు పాటుపడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో ముందుకుపోతోందన్నారు. తనకు ‘పద్మవిభూషణ్’ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

Advertisement

దేశంలోని రైతులు, మహిళలు, యువత, నాతోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం క‌ృషి చేద్దామని పిలుపునిచ్చారు. మాతృభూమి సేవకు పునరంకితం అవుదామన్నారు. తనతోపాటు పద్మవిభూషన్ పురష్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తన నటనా మటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొని చలన చిత్ర రంగానికి బహుముఖ సేవు అందించారని చిరంజీవిని ప్రశంసించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×