E-Paper
Advertisement

Mumbai actress kadambari case: ముంబై నటి జెత్వానీ కేసు.. తొలి విడత ఇద్దరిపై వేటు, రెండో విడతలో..

Mumbai actress kadambari case: ముంబై నటి జెత్వానీ కేసు.. తొలి విడత ఇద్దరిపై వేటు, రెండో విడతలో..
Advertisement

Mumbai actress kadambari case: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తు జోరందుకుంది. ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత తొలి విడతగా ఇద్దరు పోలీసుల అధికారులపై వేటు పడింది. రెండో విడతలో మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసుల వికెట్లు పడుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు మొదలై ఇప్పటికి 20 రోజులు గడుస్తోంది. ఒకవైపు డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ, మరోవైపు స్పెషల్ అధికారి విచారణ, ఈ రెండింటితో లభించిన ఆధారాలతో తొలుత ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఒకరు విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు, మరొకరు ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు. రెండో విడతలో మరో ముగ్గురు అధికారు లున్నారు. చివరి స్టేజ్‌లో నలుగురు ఐపీఎస్‌లపై కొరడా ఝులిపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం నటి కాదంబరి జెత్వానీ.. తల్లిదండ్రులు, న్యాయవాదితో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు వచ్చింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిమిషాల వ్యవధిలో ఆయా అధికారులపై కొరడా ఝులిపించారు పోలీస్ బాస్. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌కు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

ఈ వ్యవహారంపై మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఓ ఎస్‌ఐ రోల్ ఉన్నట్లు అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. త్వరలో వారిపై వేటు పడే ఛాన్స్ ఉందట. నటి  విజయవాడలో ఉండగానే ఏసీపీ స్థాయి అధికారిపై వేటు పడడంతో కీలక అధికారులకు టెన్షన్ మొదలైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్ అధికారులు కొద్దిరోజులుగా డీజీపీ ఆఫీసుకు రాలేదని వార్తలు వస్తున్నాయి.

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌ని ప్రభుత్వం నియమించింది. ముంబై నుంచి విజయవాడ వచ్చింది నటి జెత్వానీ. రెండురోజులపాటు అక్కడే మకాం వేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి సీపీతోపాటు విచారణ అధికారికి వివరించింది.

ఆమె ఫిర్యాదు స్పీకరించిన పోలీసులు, నటి చెప్పిన మాటలను రికార్డు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, ఆదేశాలతో విజయవాడ కమిషనర్ కాంతిరానా, డీసీపీ విశాల్ గున్నీలు తనపై ఇబ్రహీంపట్నంలో అక్రమంగా కేసు బనాయించారని వాంగూల్మంలో పేర్కొంది.

అధికారులను విచారించే క్రమంలో పోలీసులపై వేటు వేసినట్టు తెలుస్తోంది. వాటికి నోటీసులు విచారించనున్నారు. సేకరించిన వివరాలను దగ్గర పెట్టి సస్పెండ్ అయిన అధికారులను విచారించనున్నట్లు సమాచారం. మొత్తానికి ముంబై నటి కేసులో తీగలాగితే డొంక అంతా కదులుతోందన్నమాట. ఇంకెన్ని పెద్ద తలకాయలు వస్తాయో చూడాలి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×