E-Paper
Advertisement

Tirumala News: శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల జారీ, మార్పు వెనుక..

Tirumala  News:  శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల జారీ, మార్పు వెనుక..
Advertisement

Tirumala News: తిరుమల పేరు చెబితే నిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయినా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్వామి దర్శనం టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా దానిపై సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి?

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక

Advertisement

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన. శ్రీవాణి టికెట్ల జారీలో ఆఫ్‌లైన్ వ్యవస్థని రద్దు చేసింది టీటీడీ. ఆఫ్‌ లైన్ విధానంలో ప్రతీ రోజూ భక్తులకు 800 శ్రీవాణి దర్సనం టికెట్లను కేటాయిస్తోంది. జనవరి 9 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం అమల్లోకి రానుంది. ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

ఈ విషయాన్ని భక్తులు గమనించుకోవాలని సూచన చేసింది. తిరుమలలో ప్రస్తుతం ఆఫ్‌లైన్ ద్వారా ప్రతీ రోజు 800 దర్శనం టికెట్లను జారీ చేస్తోంది టీటీడీ. ఆఫ్ లైన్ పద్దతిని జనవరి 9 నుంచి రోజు వారి కరెంట్ బుకింగ్‌లోకి మారుతోందిజనవరి 9వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవాణి దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Advertisement

శుక్రవారం నుంచి శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ

శ్రీవాణి దర్శనం టికెట్ పొందిన భ‌క్తులు.. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. దీనికితోటు మరో సూచన చేసింది టీటీడీ. కుటుంబంలో కేవలం న‌లుగురు సభ్యులకు మాత్రమే శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి అనుమతి ఉంటుంది.

అంతేకాదు టికెట్ల బుకింగ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్‌తో పాటు మొబైల్ నెంబర్ వివరాలను తప్పనిసరి చేసింది టీటీడీ. అలాగే మొదట వచ్చినవారికి మొదట ప్రాతిపదికన దర్శనం టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అమల్లోకి వచ్చింది. తొలుత ఈ పద్దతిని నెలరోజుల పాటు పరిశీలించాలని ఆలోచన చేస్తోది. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు వేచి చూడాల్సిన అవసరం లేదు.

ALSO READ:  వేగం పెంచిన కూటమి సర్కార్..  అడ్డంకులు తొలగిస్తూ అమరావతి పరుగులు

ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో ప్రతిరోజూ 500 శ్రీవాణి దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఏర్పాటు చేస్తున్న కొత్త విధానంపై మూడు నెలల తర్వాత సమీక్షిస్తామని తెలిపింది. దీనికితోడు తిరుపతి ఎయిర్‌పోర్టులో ఆఫ్‌లైన్ విధానం కొనసాగుతోంది. ప్రతిరోజూ 200 శ్రీవాణి దర్శనం టికెట్లు అక్కడ జారీ చేస్తున్నారు. ఈ విధానం యథాతథంగా కొనసాగుతోంది.

అన్నివ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామని, దయచేసి గ‌మ‌నించి భ‌క్తులు ద‌ర్శ‌నం కోసం తమ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.  కొద్దిరోజుల కిందట శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై తిరుమలలో పెద్ద రచ్చ సాగింది. రాత్రి నుంచి లైన్ లో ఉన్నా, మాకు టికెట్లు లభించలేదని పలువురు భక్తులు వాపోయారు. ఈ విషయంలో టీటీడీ సిబ్బంది చేతివాతం ప్రదర్శించినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. జరిగిన పరిణామాలను గమనించిన టీటీడీ, కొత్త విధానానికి శ్రీకారం చుట్టుందని చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×