E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో దర్శన టికెట్లు.. ఆరోపణలపై టీటీడీ క్లారిటీ

Tirumala News: తిరుమలలో దర్శన టికెట్లు.. ఆరోపణలపై టీటీడీ క్లారిటీ
Advertisement

Tirumala News:  కలియుగ వైకుంఠం శ్రీనివాసుడి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎక్కడో దగ్గర ఆ సమస్య వెంటాడుతూనే ఉంది. తాజాగా అలాంటి సమస్యపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి దర్శనాల టికెట్లు జారీలో ఆలస్యమవుతుందని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీటీడీ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

శ్రీవాణి దర్శనాలకు సంబంధించి తిరుమలలో కొందరు భక్తులు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది టీటీడీ. గురువారం ఉదయం శ్రీవాణి దర్శనాలకు వచ్చిన నలుగురు భక్తులు వచ్చారు. శ్రీవాణి టికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని, మంచి గదులు కేటాయించడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. గంటల తరబడి ఉన్నా, కనీసం కూర్చోవడానికి వసతులు లేవంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

దీనిపై ఈవోకు ఫిర్యాదు చేయాలని భావించినా కుదరలేదన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత రూ. 500, రూ.1000 గదులకు బదులు రూ.50 గదులు కేటాయించారని వాపోయారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. రోజు ఉదయం 8.30 గంటలకు శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నామని తెలిపింది టీటీడీ.

టికెట్లు ఇచ్చే ముందు ఒక గంట ముందు వస్తేనే భక్తులను ఆయా కౌంటర్ వద్దకు అనుమతించడం జరుగుతుందని పేర్కొంది. సదరు భక్తులు వేకువజామున వచ్చి టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని ఆరోపించడం సరికాదని పేర్కొంది. సాధారణంగా శ్రీవాణి టికెట్ కౌంటర్ తెరిచే సమయానికి ముందు నుండి టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

ALSO READ: ఏపీలో ఫస్ట్ ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’, ఇదొక గేమ్‌ ఛేంజర్‌

రూ. 50 రూపాయల గదులు తనిఖీ చేశామని, పరిశుభ్రంగానే ఉన్నాయన్నారు. టీటీడీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం తగదని, రద్దీ నేపథ్యంలో భక్తులు సహకరించాలని సూచన చేసింది. ఈ విషయంల అసత్య ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

నార్మల్‌గా తిరుమలలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు లేక చాలామంది భక్తులు శ్రీవాణి దర్శనాల కొరకు ఎదురుచూస్తారు. తొలి వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికలో పరిమిత సంఖ్యలో టికెట్లను ఇస్తుంది. శ్రీవాణి టికెట్లను ప్రతిరోజూ మరుసటి రోజు శ్రీవారి దర్శనం కొరకు టికెట్లను కేటాయిస్తుంది‌.

శ్రీవాణి టికెట్ల భక్తులు సాధారణంగా తిరుపతి నుంచి వసతి తీసుకుని వస్తుంటారు.  కొంతమంది డిమాండ్ చేస్తే అందుబాటులో ఉన్న రూములను కేటాయిస్తారు. తిరుమలలో వసతి, మరుగుదొడ్లను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరోగ్య విభాగంలోని సిబ్బంది 24 గంటలూ కృషి చేస్తారు.

భక్తుల నుంచి ఎలాంటి ఆరోపణలకు తాము ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారు. వాస్తవాలు ఇలా ఉండగా.. సదరు భక్తులు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×