E-Paper
Advertisement

Prakasam News: ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది, రంగంలోకి పోలీసులు

Prakasam News: ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది,  రంగంలోకి పోలీసులు
Advertisement

Prakasam News: కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రయాణికులు భయపడుతున్నారు. ట్రావెల్ బస్సులంటే జర్నీ వద్దు బాబోయ్ అనే పరిస్థితి వచ్చేశారు.  ఆ ఘటన తర్వాత పలు సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.

ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Advertisement

కర్నూలు జిల్లాలో ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనను కళ్లతో చూశారు ప్రజలు. మంటల్లో బస్సు దగ్ధమైన సన్నివేశాలు ఇప్పటికే చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సులో జర్నీకి దూరంగా ఉండాలని చాలామంది నిర్ణయం తీసుకున్నారు. అయినా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ చేసి మరీ ట్రావెల్ బస్సులను పంపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆదివారం రాత్రి మార్కాపురం నుంచి బెంగళూరుకు ఆర్‌వీటీ ప్రైవేటు ట్రావెల్స్‌‌కి చెందిన బస్సు బయలు దేరింది. అయితే బస్సు.. వేములకోట-కోమటికుంట ప్రాంతంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బస్సుని తప్పించబోయింది.

Advertisement

మార్కాపురం నుండి బెంగళూరు ట్రావెల్ బస్సు

అదుపు తప్పి రహదారి పక్కన ముళ్ళ డొంకలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో డ్రైవర్‌‌తోపాటు ఎనిమిది మంది ప్రయాణికులున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్య స్థానాలకు తరలించారు.

కర్నూలు ఘటన తర్వాత గడిచిన మూడురోజులుగా ట్రావెల్ బస్సుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది రవాణా శాఖ.  ఒక్క ఏపీలో 361 బస్సులపై కేసులు నమోదు చేశారు. 40 బస్సులను సీజ్ చేశారు. ముఖ్యంగా ఆలిండియా పర్మిట్ తీసుకున్న బస్సులు, వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి ఏపీలో తిరుగుతున్న వాటిపై ఫోకస్ చేశారు. అన్నిపత్రాలను చెక్ చేస్తున్నారు. లేకుంటే కేసులు నమోదు చేస్తున్నారు.

ALSO READ:  ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా తుపాను, ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

బస్సులను ఆల్టరేషన్ చేశారా? అగ్ని ప్రమాదానికి సంబంధించిన పరికరాలు ఉన్నాయా? అనేకోణంలో తనిఖీ చేస్తున్నారు. అత్యవసర ద్వారాలు లేకుండా దాదాపు 10 బస్సులను గుర్తించినట్టు తెలుస్తోంది. కొన్ని బస్సుల్లో కనీసం ప్రయాణికుల జాబితా లేదని తేలింది. ఏపీ, తెలంగాణలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేయడంతో సగానికి పైగా ట్రావెల్ బస్సులు రోడ్డు ఎక్కలేదని తెలుస్తోంది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×