E-Paper
Advertisement

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని
Advertisement

Nellore News: హిజ్రాలు రూటు మార్చారా? అడిగినంత ఇవ్వకుండా సామాన్యులపై దాడి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారా? ఉత్తరాది వాళ్ల దారిని ఎంచుకున్నారా? అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఆసుపత్రిలో నర్సుపై మూకుమ్మడిగా హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రాన్స్ జెండర్లు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇచ్చినంత డబ్బులు తీసుకునేవారు. వారు రూటు మార్చారు. తాము ఎంత అడిగితే అంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇవ్వకుంటే సామాన్యులపై దాడులు చేస్తున్నారు కూడా. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో వెలుగుచూసింది.

Advertisement

నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు దాడులకు తెగబడ్డారు. మ‌ద్యం మ‌త్తులో ఆసుపత్రిలో ప‌ని చేస్తున్న న‌ర్సుని మూమూలు డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు ఎందుకుంటాయని ఆమె ఎదురు ప్రశ్నించింది. వారిని ప్రశ్నించడమే ఆ నర్సు చేసిన తప్పు. తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆరుగురు హిజ్రాలు నర్సుని బ‌య‌ట‌కు లాకొచ్చి దాడి చేశారు.

కొన్ని ఫైల్స్ తీసుకుని కింద విసిరి పారేశారు. ఈలోగా పేషెంట్లు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ నర్సుని దాడి చేశారు. నర్సు జుట్టు పట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. ఆపై బట్టలు చించేసి దాడి చేశారు హిజ్రాలు. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో ఈతతంగమంతా రికార్డు అయ్యింది.

Advertisement

ALSO READ: జైలులో బత్తుల ప్రభాకర్ ఏమేమి చేసేవాడు

దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిజ్రాల‌పై క‌ఠినచ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు సామాన్యులు. నెల్లూరు జిల్లాలో రోజురోజుకూ వీరి ఆగ‌డాలు పెరిగిపోతున్నాయని మండిప‌డుతున్నారు.

ఒకప్పుడు హిజ్రాలు సామాన్యులు ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. అయితే ఉత్తరాది నుంచి ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలకు చాలామంది హిజ్రాలు వలస వచ్చారు. వారంతా రాష్ట్రాలు, ప్రాంతాలుగా విడిపోయారు. పిల్లల బర్త్ డే ఫంక్షన్లు, షాపు ఓపెనింగులు, గృహ ప్రవేశం వంటి కార్యక్రమాలు జరిగితే క్షణాల్లో వాలిపోతుంటారు.

వారికి కావాల్సినంత డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇంటి నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటారు. అంతేకాదు తెల్లవారుజామున వాహనంలో తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే పెళ్లి, గృహ ప్రవేశాలు తెలుసుకుని వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు కూడా.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×