E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో ఫోటోషూట్ ఇష్యూ.. తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ..

Tirumala News: తిరుమలలో ఫోటోషూట్ ఇష్యూ.. తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ..
Advertisement

Tirumala News: తిరుమల కొండపై కొత్త జంట ఫోటోషూట్ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఫోటోషూట్ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో నేరుగా నూతన దంపతులు రంగంలోకి దిగారు. అంతేకాదు కొన్ని విషయాలు బయటపెట్టారు. మళ్లీ వస్తామని అంటున్నారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది?

తిరుమలలో దంతపుల ఫోటోషూట్ వ్యవహారం

Advertisement

తిరుమల కొండపై నూతన దంపతులు మాడవీధుత్లో నానాహంగామా చేశారు. లొకేషన్ ఎక్కడ బాగుంటే అక్కడ ఫోటోషూట్ చేశారు. అంతేకాదు నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాలు బయటకు కనిపించడంతో భక్తులు ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశారు. ఈ జంటకు చెందిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో తొలుత కంగారుపడింది ఆ జంట. తమ పరువు పోతుందని భావించిన నేరుగా ఓ వీడియో రిలీజ్ చేసింది.

తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తిరుమల్-గాయత్రి దంపతులకు ఇటీవల వివాహం జరిగింది. వివాహం తర్వాత ఈ జంట తొలుత తిరుమల పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో సినిమాటిక్ స్టైల్‌లో ఫోటో‌షూట్ చేశారు. అంతేకాదు మధ్యమధ్యలో కొన్ని రీల్స్ చేశారట. తిరుమల కొండపై రీల్స్, ఫోటోషూట్‌ లపై ఆంక్షలు ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది కళ్లుగప్పారు.

Advertisement

తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ

వీరి వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆ దంపతులు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం మాకు లేదన్నారు. తెలియక చేసిన తప్పును క్షమించాలని అందులో కోరారు. త్వరలో తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని చేసిన తప్పును సరిదిద్దుకుంటామని వేడుకున్నారు.

ఈ వ్యవహారంలో తప్పంతా సెక్యూరిటీ సిబ్బందేనని అంటున్నారు శ్రీవారి భక్తులు.  స్వామి సన్నిధిలో అంత జరుగుతున్నా సెక్యూరిటీ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు? తిరుమల కొండపై అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, వాటిని మోనటరింగ్ చేస్తున్న సిబ్బంది మాటేంటి?  అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. తప్పులు చేసి సారీ చెప్పడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్‌గా మారిందని అంటున్నారు.

ALSO READ: అరవ శ్రీధర్ ఎంత పని చేశారు.. కొత్త వీడియోలో కీలక అంశాలు

నూతన దంపతులు చేసిన తప్పును తెలుసుకున్నారని అంటున్నారు. బాధ్యతలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. ఇలాంటి తప్పు మరొకసారి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×